శేఖర్ కమ్ముల ఈ వారం దుబాయ్ పోతున్నారు. సమ్మర్ హాలీడేస్కు ఫ్యామిలీతో కాదు. సినిమా యూనిట్తో షూటింగ్ కోసం. ఆయన మల్టీ డైమన్షన్ సంస్థలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయి. ఈ వారం దుబాయ్లో షెడ్యూల్ మొదలవుతుంది. వారం రోజులు చిత్రంలో నటీనటులందరూ దుబాయ్లోని అందమైన ప్రదేశాల్లో షూటింగ్లో పాల్గొంటారు. ఆ తర్వాతి నుంచి హైదరాబాద్లో షెడ్యూల్ ఉంటుంది. ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. వరుణ్తేజ్, సాయిపల్లవి జంటగా నటించిన `ఫిదా` తర్వాత శేఖర్ కమ్ముల ఇప్పటిదాకా ఇంకే సినిమానూ చేయలేదు. ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా గడిపిన ఆయన ఇప్పుడు ఈ సినిమాతో బిజీగా ఉన్నారు. తన సినిమాకు సంబంధించిన విషయాలన్నిటినీ షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత, విడుదలకు ముందు వైస్రాయ్ హోటల్లో ప్రెస్మీట్ పెట్టడం శేఖర్ కు అలవాటు. ఈ సినిమాకు సంబంధించి కూడా అదే చేస్తారేమో చూడాలి. వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న శేఖర్ `ఫిదా`తో కమర్షియల్ బాట పట్టారు. ఈ సినిమా అటు తన మార్కులో సాగుతుందా? ఇటు కమర్షియల్గా ఉంటుందా తెలుసుకోవాలంటే వెయిట్ అండ్ సీ అన్నమాట.
previous post
next post
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!