మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇటీవల జాతీయ అవార్డు అందుకోవటం తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన “అలా వైకుంఠపురం లో” సినిమాకి గాను బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ జాతియా అవార్డు అందుకున్నారు. 2020లో విడుదలైన ఈ సినిమాలో “సామజ వర గమన”, బుట్ట బొమ్మ పాటలు అప్పట్లో ఎంతగానో ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలో అనేక రికార్డులు కూడా సృష్టించాయి. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కిన ఏ సినిమా క్రియేట్ చేయని రికార్డులు “అలా వైకుంఠపురంలో” సినిమా మ్యూజికల్ గా అనేక రికార్డులు సృష్టించడం జరిగింది.
2020లో విడుదలైన “అలా వైకుంఠపురంలో” టాలీవుడ్ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది. సినిమా విజయం సాధించడంలో సంగీతం కీలక పాత్ర పోషించింది. ఈ క్రమంలో 68వ భారతీయ చలనచిత్ర అవార్డుల క్రమంలో తమన్ కి బెస్ట్ మ్యూజిక్ రావటం పట్ల తాజాగా ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ అభినందించడం జరిగింది. స్పెషల్ బొకే కూడా పంపించారు. ఈ విషయాన్ని తమ ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేసి నాకు ఏఆర్ రెహమాన్ నుండి సర్ప్రైజ్ గిఫ్ట్ రావడం చాలా ఆనందాన్ని కలిగించింది అంటూ తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. అంతేకాకుండా ఏఆర్ రెహమాన్ కి తమన్ థాంక్స్ చెప్పడం జరిగింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం తమన్ సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చాలా సినిమాలకు సంగీతం అందిస్తూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో జాతీయ అవార్డు రావడంతో తమన్ కెరియర్ మరింతగా దూసుకుపోతుందని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. బాలకృష్ణ, చిరంజీవి, రామ్ చరణ్, మహేష్ బాబు చేస్తున్న సినిమాలకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటీవల తమన్ అందించిన చాలా సినిమాలు.. సంగీత పరంగా సూపర్ డూపర్ హిట్ కావటం జరిగాయి. బాలకృష్ణ “అఖండ” విజయం సాధించడంలో తమన్ అందించిన మ్యూజిక్ కీలక పాత్ర పోషించింది. చాలావరకు గతంలో కంటే ఇప్పుడు తమన్ పైవిద్యమైన మ్యూజిక్ అందిస్తూ ఉన్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!