Samantha: సమంత.. ఈమె తెలియని వారుండరు. గత కొన్నేళ్ల నుంచి టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా సత్తా చాటుతున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవలె భర్త నాగ చైతన్య నుంచి విడిపోయి అక్కినేని కుటుంబంతో తెగ దెంపులు చేసుకుంది. ప్రస్తుతం కెరీర్పైనే ఫోకస్ పెట్టిన సమంత.. వరుస సినిమాలను లైన్లో పెడుతూ దూసుకుపోతోంది.
ఇదిలా ఉంటే.. ఈ రోజు సమంతకు ఎంతో స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే, ఈమె నటించిన మొదటి చిత్రం `ఏ మాయ చేశావే` 12 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే తేదీని విడుదల అయింది. నాగ చైతన్య, సమంత జంటగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ ప్రేమ కథా చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి భారీ కలెక్షన్లను రాబట్టింది.
2010లో విడుదలైన ఈ సినిమాతోనే సమంత కెరీర్ స్టార్ట్ అయింది. అంటే సమంతకు నటిగా పన్నెండేళ్లు నిండాయన్న మాట. ఈ నేపథ్యంలోనే తాజాగా సామ్ భావోద్వేగానికి గురవుతూ ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. `నేటితో నా సినీ ప్రయాణం 12 ఏళ్ళు పూర్తి చేసుకుంది. లైట్స్, కెమెరా, యాక్షన్ అనే మూడు మార్చలేని పదాలతో ఇక్కడి వరకు చేరుకున్నాను.
ఇన్నేళ్ల ప్రయాణంలో ప్రపంచ వ్యాప్తంగా నిస్వార్థమైన అభిమానులను పొందినందుకు ఆనందంగా ఉంది. సినిమాపై నాకున్న ప్రేమ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా` అంటూ సమంత తన పోస్ట్లో పేర్కొంది. దీంతో ప్రస్తుతం ఈమె పోస్ట్ కాస్త నెట్టింట వైరల్గా మారింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!