Marimuthu: తమిళ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు డైరెక్టర్ మారిముత్తు (57) నేడు మృతి చెందడం జరిగింది. ఈరోజు ఉదయం గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఇటీవల రజనీకాంత్ హీరోగా వచ్చిన “జైలర్” సినిమాలో కూడా కీలక పాత్ర పోషించారు. “జైలర్” సినిమాలో విలన్ కి అత్యంత నమ్మకస్తుడిగా ఉండే పాత్రలో చాలా సైలెంట్ గా కనిపిస్తూ ప్రేక్షకులను అలరించారు. “జైలర్” సినిమా ఇటీవల సూపర్ డూపర్ హిట్ కావటం తెలిసిందే. ఈ సినిమాలో నటించిన అందరికీ మంచి గుర్తింపు లభించింది. విలన్ పాత్రలో నటించిన వినాయకన్ నటన చాలామందిని ఆకట్టుకుంది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ విలన్ నీ అద్భుతంగా చాలా కురవరంగా చూపించారు.
“జైలర్” మూవీ రజినీకాంత్ కెరియర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా రికార్డులు సృష్టించడం జరిగింది. సినిమాకి హీరోయిజంతో పాటు విలనిజం… చాలా అద్భుతంగా చూపించడం జరిగింది. అత్యంత క్రూరత్వంగా విలన్ పాత్రలో వినాయకన్ నటించారు. అటువంటి విలన్ పాత్రకి నమ్మకస్తుడిగా మారిముత్తు నటన సినిమాకి హైలెట్ గా నిలిచింది. మారిముత్తు ఇప్పటివరకు దాదాపు 100కు పైగా సినిమాలలో నటించడం జరిగింది. విక్రమ్ సినిమాలో కూడా నటించారు. డైరెక్టర్ మరియు నటుడిగా తమిళ సినిమా రంగంలో ముత్తు తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.
సన్ టీవీలో యాంటీ స్విమ్మింగ్ అనే సీరియల్ తో పేరు సంపాదించుకున్నారు. తమిళ సినిమా రంగంలో ముత్తకి చాలామంది నిర్మాతలు దర్శకులు నటులతో మంచి పరిచయాలు ఉన్నాయి. అటువంటి నటుడు డైరెక్టర్ హఠాత్తుగా మరణించడంతో తమిళ చిత్ర పరిశ్రమల విషాదం నెలకొంది. మారిముత్తు మరణం పట్ల చాలామంది ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మంచి నటుడిని కోల్పోయామంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు. మారిముత్తు మృతి తమిళ్ ఇండస్ట్రీకి తీరని లోటు అని ఇండస్ట్రీకి చెందిన నటీనటులు వ్యాఖ్యానిస్తున్నారు.