Niharika: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి అందరికీ సుపరిచితుడే. చాలామంది సెలబ్రిటీల జీవితాలలో జరగబోయే విషయాలను ముందుగానే తెలియజేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు. 2019 ఎన్నికలలో వైఎస్ జగన్ గెలుస్తారని ఈయన చెప్పిన జ్యోతిష్యం నిజమైంది. అదే సమయంలో 2024 ఎన్నికలలో కూడా వైయస్ జగన్ ముఖ్యమంత్రి పీఠానికి డోకా లేదని చెప్పుకొచ్చారు. చరణ్ కూతురు తండ్రి తాత కంటే ఉన్నత స్థాయికి ఎదుగుదని తెలియజేశారు. అదేవిధంగా ప్రభాస్ “ఆదిపురుష్” సినిమా రిలీజ్ కాకముందే పరాజయం అవుద్దని చెప్పగా ఆ రీతిగానే సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక భర్త చైతన్య నుండి విడాకులు తీసుకోవడం తెలిసిందే. ఇద్దరు ఇష్టపూర్వకంగా విడిపోతున్నట్లు క్లారిటీ ఇవ్వటం జరిగింది. నిన్ననే నిహారిక ఇకనుండి ఎవరికి వారు తమ వ్యక్తిగత జీవితాలలో రాణిస్తున్నట్లు తాము తీసుకున్న నిర్ణయాన్ని అందరు గౌరవించాలని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. విడాకులు కన్ఫామ్ కావడంతో మెగా ఫ్యామిలీకి పెళ్లి అచ్చు రావడం లేదని భారీ ఎత్తున విమర్శలు కామెంట్లు వస్తున్నాయి. పవన్ మూడు పెళ్లిళ్లు అదేవిధంగా శ్రీజ రెండో పెళ్లి చేసుకోవడం తాజాగా నిహారిక విడాకులు తీసుకోవడంతో మెగా ఫ్యామిలీ అమ్మాయిలకు పెళ్లి కలిసి రావడం లేదని కామెంట్లు చేస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే జ్యోతిష్యుడు వేణు స్వామి నిహారిక విడాకులు తీసుకున్న తర్వాత జీవితంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
మేటర్ లోకి వెళ్తే.. నిహారిక పెళ్లి సమయంలో ఆమె జాతకం గురించి వేణు స్వామి హెచ్చరించడం జరిగిందట. చేసుకోబోయే భర్త చైతన్య జాతకం చూసుకోమని.. వివాహ బంధం నిలవడం కష్టమని ఒకవేళ కలిసే ఉన్నా సంతానం లేదంటూ గొడవలు మొదలవుతాయని… ముందుగానే హెచ్చరించారట. అయితే ఇప్పుడు నిహారిక… విడాకుల తర్వాత ఆమె ఒంటరిగానే మిగిలిపోయే అవకాశం ఉందని వేణు స్వామి తెలియజేయడం జరిగిందట. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 2020లో నిహారిక పెళ్లి చేసుకోగా రెండు సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం సంచలనంగా మారింది. ఇటీవల చాలామంది సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం ఎక్కువైపోయింది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!