మెగాపవర్స్టార్ రామ్చరణ్, స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం `ఎవడు`. 2014లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. వంశీపైడిపల్లి దర్శకుడు. దిల్రాజు నిర్మాత. ఇప్పుడు ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను బాలీవుడ్లో రీమేక్ చేయాలనుకుంటున్నారట. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ చిత్రంతో దిల్రాజు బాలీవుడ్లోకి నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నారు. `హేట్స్టోరీ 4` చిత్రాన్ని తెరకెక్కించిన మిలప్ జవేరి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. నిఖిల్ అద్వాని, దిల్రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగానే.. నటీనటులను ఎంపిక చేస్తారట.
previous post
next post
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!