గత కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వారి పార్టీపై మరియు వారి అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి పై విపరీతమైన విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఆయనకు మరియు వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కూడా జరుగుతోంది. ఇప్పటికే ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు రోజూ వార్తల్లో నిలుస్తున్నాడు.
తాజాగా ఇప్పుడు ఆయన వైసిపి నేతలపై మరియు ఆ పార్టీ కార్యకర్తలపై పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీకి లేఖరాశారు. లేఖలో తన దిష్టిబొమ్మలను దహనం చేసి తనను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలో పర్యటిస్తే దాడి చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని అన్నారు.
ముందు సొంత పార్టీ పైన మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఎన్నో విమర్శలు చేసిన అతనికి…. పార్టీకి రాజీనామా చేయకుండానే అన్నీ మాట్లాడిన కృష్ణం రాజు కి పార్టీ కార్యకర్తల నుండి సమాధానం వస్తుందో తెలియదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
సొంత పార్టీ వారి పైనే తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన ఆ లేఖలో కోరడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఏదైనా అధినేతతో తేల్చుకోవాలి కాని అర్థంపర్థం లే ఇ ఆరోపణలు విమర్శలు చేసి.. వారి ఆగ్రహానికి గురయి ఇలా లేఖలు రాయడం ఏమాత్రం సబబు గా లేదని వైసీపీ వారి వాదన.
జగన్ కూడా ఏదో ఒక రకంగా ఈ విషయం సద్దుమణుగుతుంది అని అనుకుంటున్న సమయంలో ఎంపీ వరుసబెట్టి ఇలా తనకి నచ్చని పనులు చేస్తుంటే ఇక తప్పదు అన్నట్లు చర్యలు తీసుకోవడానికి జగన్ కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.