హిందూ ఆచారాల వెనుక దాగి ఉన్న సైన్స్ చాలా మందికి తెలియదు. . కాళ్ళకు అలంకరణ కోసమే పట్టీలు ధరిస్తారని అందరూ అనుకుంటుంటారు. పట్టీలను వేసుకోవడం వల్ల పట్టీలు వారి మడమలను తాకుతూ ఉంటాయి. ఇలా ఉండటం వల్ల వారి కాలి ఎముకలు ధృఢంగా ఉంటాయి. కాళ్ళ పట్టీల నుంచి వచ్చే శబ్దం ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. అంతేకాదు నెగిటివ్ ఎనర్జీని కూడా తరిమేస్తుంది.
కాళ్ళపట్టీలు వేసుకుని ఇంట్లో శబ్దం చేస్తూ నడిస్తే దేవతలకు ఆహ్వానం పలికినట్టేనని పురాణాలు చెబుతున్నాయి.పాదానికి ఎప్పుడూ రాసుకుంటూ ఉండే పట్టీల వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అందువల్ల పాదాల వాపు తగ్గుతుంది. ఎముకలు బలహీనంగా ఉన్న వారికి ఈ పాదాల నొప్పి పైవరకూ పాకుతుంది. రెగ్యులర్ గా వెండి పట్టీలు పెట్టుకోవడం వల్ల ఈ సమస్యని తగ్గించవచ్చు. పట్టీలు పెట్టుకుని నడిచేటప్పుడు వచ్చే మువ్వల చప్పుడు ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీని బయటికి పంపుతుందని అంటారు. దానికి తోడు వెండికి ఉండే యాంటి-బాక్టీరియల్ ప్రాపర్టీస్ వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది..స్త్రీలు సాధారణంగా ఫేస్ చేసే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, పీరియడ్స్ సరిగా రాకపోవడం వంటివి వెండి పట్టీలు రెగ్యులర్ గా పెట్టుకోవటం వల్ల రాకుండా ఉంటాయి. గర్భవతులు తప్పనిసరిగా వెండి పట్టీలు పెట్టుకోవాలని అంటారు. దాని వల్ల ప్రసవ సమయం లో వచ్చే నొప్పి బాగా తగ్గుతుందట పట్టు లంగా, వోణీ వేసుకున్నా, జీన్స్, టీషర్ట్ వేసుకున్నా వారి వస్త్రాధరణకు తగినట్టుగా ఎన్నో పట్టీలు మార్కెట్లో లభిస్తున్నాయి. మీరు రెగ్యులర్గా పట్టీలు పెట్టుకోండి.. అందంగా మురిసిపోండి..