YSRCP: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 14వ తేదీన తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ముద్రగడ వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీలో చేరికపై తన అభిమానులకు ముద్రగడ తాజాగా లేఖ రాశారు.
ఈ మధ్య జరుగుతున్న రాజకీయ పరిణామాలు మీడియా ద్వారా మీకందరికీ తెలుసు అనుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి సీఎం జగన్ పిలుపు మేరకు వైఎస్ఆర్ సీపీలోకి వెళ్లాలని మీ ఆశీస్సులతో నిర్ణయం తీసుకున్నాను. మరలా ముఖ్యమంత్రి పీఠం మీద వైఎస్ జగన్ ను కూర్చోపెట్టడానికి ఎలాంటి కోరికలు లేకుండా పని చేస్తాను. పేదలకు మరెన్నో సంక్షేమ పథకాలు.. అబివృద్ధిని సీఎం జగన్ తో చేయించాలని ఆశతో ఉన్నాను. మీ బిడ్డ అయిన నేను ఎప్పుడు త్పు చేయలేదు..చేయను. ఈ నెల 14న కిర్లంపూడి నుండి తాడేపల్లికి బయలుదేరుతున్నాను. మీ అవకాశాన్ని బట్టి నా ప్రయాణంలో మీరు పాలుపంచుకోవడానికి రావాలని విజ్ఞప్తి చేశారు.
ఇందులోనే క్షమించాలంటూ మరో విన్నపం కూడా చేశారు. ఈ ప్రయాణంలో పాలుపంచుకునే వారు వారికి కావాల్సిన ఆహారం, ఇతర అవసరాలు వారి వాహనంలోనే తెచ్చుకోవాలని ముద్రగడ సూచించారు. అదే విధంగా ర్యాలీ రూట్ మ్యాప్ ను వివరించారు. 14వ తేదీ ఉదయం 8 గంటలకు కిర్లంపూడిలో ర్యాలీ ప్రారంభమై ప్రత్తిపాడు, జగ్గంపేట, లాలా చెరువు, వేమగిరి, రావులపాలెం, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ మీదుగా తాడేపల్లికి చేరుకోవడం జరుగుతుందని ముద్రగడ పద్మనాభం తెలియజేశారు.
YSRCP: పార్టీల పొత్తులతో చంద్రబాబు .. ప్రజాబలంతో మనం – వైఎస్ జగన్