ప్రస్తుతం భారత్లో డిజిటల్ పేమెంట్స్ హవా నడుస్తోంది.. పది రూపాయల నుంచి వేల రూపాయల క్రయ విక్రయాల వరకు అందరూ యూపీఐ (UPI) పేమెంట్స్ కి ఆసక్తి చూపుతున్నారు.. దీంతో మొబైల్ ఆధారిత పేమెంట్స్ ఎక్కువ అయ్యాయి.. తాజాగా Unified payments interface (UPI) ద్వారా డిజిటల్ పేమెంట్ చేసే వినియోగదారులకు National payments corporation of India (NPCI) కీలక ప్రకటన విడుదల చేసింది.. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం..
యూపీఐ ద్వారా పేమెంట్స్ ఆ టైంలో చేయొద్దని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సూచించింది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ని అప్ గ్రేడ్ చేస్తున్న నేపథ్యంలో చెల్లింపులు పనిచేయకపోవచ్చు. కొద్దిరోజుల్లో అప్ గ్రేడ్ upgrade చేస్తున్న సమయంలో రాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 3 గంటల మధ్యలో పేమెంట్స్ చేయవద్దని సూచించింది. ఇలా ఎన్ని రోజులు అనేది స్పష్టంగా తెలపలేదు. కొద్ది రోజుల పాటు అసౌకర్యానికి గురి అయ్యే అవకాశం ఉందని చెల్లింపుల విషయంలో ముందే ప్లాన్ చేసుకోవాలని NPCI ట్విట్టర్ వేదికగా tweet చేసింది.
National payments corporation of India సూచించిన టైం లో ఎలాంటి లావాదేవీలు చేయకుండా ఉండాలని తెలిపింది. కస్టమర్లకు సురక్షితమైన, ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో UPI ప్లాట్ ఫామ్ ను అప్ గ్రేడ్ చేస్తున్నామని వివరించింది. ప్రస్తుతం BHIM UPI ప్లాట్ ఫామ్ లో 165 బ్యాంకులు లిస్టు లో ఉన్నాయి. అక్టోబర్ 2020 నాటికి NPCI లో android 155.4 మిలియన్ యూజర్లను, ios లో 2.4 మిలియన్ యూజర్లను కలిగి ఉంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో డిజిటల్ పేమెంట్ ఎక్కువగా జరిగాయి. డిస్కౌంట్, cash back ఆఫర్లు ఉండడంతో యూజర్లు ఎక్కువగా ఎట్రాక్ట్ అయ్యారు. UPI ప్లాట్ ఫామ్ మార్కెట్లో గూగుల్ పే ను వరుసగా మూడోసారి అధిగమించడం విశేషం. యూపీఐ యూజర్లకు మరింత మంచి ఎక్స్పీరియన్స్ తో పాటు భద్రత కల్పించే క్రమంలో లో UPI ని అప్గ్రేడ్ చేస్తున్నామని వివరించారు.
ఇది కూడా చదవండి : హీరో మోత మోగించింది..!! మరో అరుదైన రికార్డ్..!!
To create a better architecture for the growth of UPI transactions, the UPI platform will be under an upgradation process for next few days from 1AM – 3AM.
Users may face inconvenience, so we urge you all to plan your payments. pic.twitter.com/oZ5A8AWqAB— NPCI (@NPCI_NPCI) January 21, 2021