తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఈరోజు కీలక ప్రకటన చేసారు. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ ను పీవీ జ్ఞాన్ మార్గ్ గా పేరు పెడతామని కేసీఆర్ ప్రకటించారు. అంతే కాకుండా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారత రత్న ఇవ్వాలని తీర్మానం చేస్తామని కేసీఆర్ అన్నారు.
ప్రపంచం గుర్తించిన తెలుగు బిడ్డగా పీవీను కొనియాడారు తెలంగాణ ముఖ్యమంత్రి. అలాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేస్తామన్నారు. హైదరాబాద్ లో పీవీ మెమోరియల్ ను నిర్మిస్తామని కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా పీవీను కొనియాడారు. భారతదేశంలో గొప్ప సంస్కరణలు చేసిన సంస్కర్తగా పీవీ నరసింహారావును పొగిడారు కేసీఆర్.