రీసెంట్ గా నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ అన్న సినిమా షూటింగ్ కంప్లీట్ చేశాడు. ఈ సినిమాతో నాగార్జున అహిషోర్ సాల్మన్ అనే కొత్త దర్శకుడుని టాలీవుడ్కు పరిచయం చేస్తున్నాడు. వీకెండ్స్ లో బిగ్బాస్ షో కి హోస్ట్గా చేస్తూనే మరోవైపు ‘వైల్డ్డాగ్’ కంప్లీట్ చేసి బాలీవుడ్ సినిమా బ్రహ్మాస్త్ర’ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. వారం రోజులు షూటింగ్ చేస్తే.. బ్రహ్మాస్త్ర’ సినిమాలో నాగార్జున పార్ట్కు సంబంధించిన షూట్ కంప్లీటవుతుందని సమాచారం.
గతంలో నాగార్జున పార్ట్ కంప్లీటైనప్పటికి .. స్క్రీన్ ప్లేలో కొన్ని మార్పులు చేసినందువల్ల అదనంగా కొన్ని సీన్స్ తీయాల్సి రావడం తో ఇప్పుడు నాగార్జున బ్రహ్మాస్త్ర’ లో పాల్గొంటున్నాడట. ఇక ఈ సినిమా కూడా కంప్లీట్ అయితే వరసగా టాలీవుడ్ ప్రాజెక్ట్స్ ని ప్లాన్ చేస్తున్నాడట. మరో నెలరోజుల్లో బిగ్ బాస్ షో కంప్లీట్ అవబోతుంది. ఈ నేపథ్యంలో బంగార్రాజు సినిమాని సెట్స్ మీదకి తీసుకు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు.
అలాగే తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఒక సినిమాలో నాగార్జున ధనుశ్తో కలిసి నటించబోతున్నాడని సమాచారం. వాస్తవంగా ఈ సినిమా ఇంతక ముందే మొదలై ఆగిపోయింది. ఇక మరోవైపు నాగార్జున గరుడ వేగ ఫేం ప్రవీణ్ సత్తారు కథ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలాగే పూరీ జగన్నాథ్ – నాగార్జున కాంబినేషన్ లో కూడా ఒక ప్రాజెక్ట్ ఉండబోతుందట. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో సూపర్ అన్న సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇక యాత్ర దర్శకుడు మహి వి రాఘవ చెప్పిన కథ కూడా నాగ్ కి నచ్చి చేద్దామని మాటిచ్చినట్టు సమాచారం.
క్రైం థ్రిల్లర్ గా ఈ సినిమా కథ సాగుతుందని తెలుస్తుంది. అలాగే బాలీవుడ్ లో అజయ్ దేవగన్ – ఇలియానా నటించిన సూపర్ హిట్ సినిమా రైడ్ ని కూడా నాగార్జున రీమేక్ చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ రీమేక్ లో కూడా హీరోయిన్ గా ఇలియానా నటించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇలా వరసగా ప్రాజెక్ట్స్ ని సెట్ చేసుకున్నాడట నాగార్జున. బిగ్ బాస్ కంప్లీట్ అవగానే ఒక్కొక్క ప్రాజెక్ట్ ని పట్టాలెక్కిస్తాడని సమాచారం. నాగ్ తో పోల్చుకుంటే టాలీవుడ్ సీనియర్ స్టార్స్ ఎవరు ఇన్ని సినిమాలు కమిటవలేదని తెలుస్తుంది.