ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష కుమార్ పునర్నియామకం, లేదా పోస్ట్ కొనసాగింపు అనే విషయంలో… ఆయనకంటే ఎక్కువగా టీడీపీ నేతలు ఫీలయిపోతోన్న సంగతి తెలిసిందే! ఈ వయసులో ఇలాంటి సమయంలో ఎందుకొచ్చిన తలపోట్లు.. శేషజీవితం ప్రశాంతంగా గడిపేద్దాం అని నిమ్మగడ్డ అనుకున్నా… టీడీపీ నేతలు ఒప్పుకునేలా లేరు అన్నా అతిశయోక్తి కాదేమో! ఈ క్రమంలో ప్రభుత్వం తరుపున ఒక పిటిషన్ సుప్రీం లో ఉన్నా కూడా.. ముందు హైకోర్టు తీర్పునే అమలుపరచాలని.. కోర్టును సంప్రదించడం.. గవర్నర్ ను కలవమని హైకోర్టు ఆదేశించడం తెలిసిందే. ఈ క్రమంలో ఊహించని మలుపు ఎదురైంది.
అంతా అనుకూలంగా జరిగి సోమవారం నిమ్మగడ్డ రమేష్ కుమార్.. గవర్నర్ ను కలిస్తే.. ఆయన “సరే” అంటారు అని చంద్రబాబు & కో పక్కాగా ఫిక్సయిపోయారు! హైకోర్టు ఆ రేంజ్ లో స్పందించింది కాబట్టి.. ఇక నిమ్మగడ్డ నియామకం తథ్యం అంటూ.. తమకు అనుకూలమైన కథనాలు, సెల్ఫ్ సేటిస్ఫేషన్ డిబేట్లు తమవర్గం మీడియాలో చేయించుకున్నారు! కానీ.. బాబు & కో ఒకటి తలస్తే… గవర్నర్ ఒకటి తలచారు! ఫలితంగా యవ్వారం మళ్లీ మొదటికి వచ్చింది!
సోమవారం గవర్నర్ ను కలిసిన అనంతరం… గవర్నర్ నుంచి “పరిశీలించి చెబుతాను” అనేమాట వచ్చేసరికి నిమ్మగడ్డకు, బాబు & కోలకు మాటపడిపోయిందని అంటున్నారు విశ్లేషకులు! ఎందుకంటే… నిమ్మగడ్డ నియామకం అవ్వడమే ఆలస్యం.. “గెలిచారు – నిలిచారు”.. “ప్రభుత్వానికి మరో మొట్టికాయ… ఈసారి గవర్నర్ వంతు”.. “బాబు వ్యూహఫలం – నిమ్మగడ్డకు కుర్చీ వరం”.. “న్యాయం గెలిచింది – నిమ్మగడ్డ కుర్చీ నిలిచింది”… వంటి కథనాలతో ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాలకు పక్కా ప్లాన్స్ చేసేసుకున్నారు!!
ఈ క్రమంలో… గవర్నర్ ప్రశాంతంగా “పరిశీలించి చెబుతాను” అనేసరికి… అనంతరం ఈ స్టేను ఎత్తివేయాలని ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసేసరికి… యవ్వారం మొదటికి వచ్చినట్లే అయ్యిందని అంటున్నారు విశ్లేషకులు! ఆయన పదవీ కాలం ముగిసేవరకూ ఈ తతంగం తధ్యం అనేది కొందరి మాట!! ఇది బాబును ఇరకాటంలో పెట్టడమే… మరి కొందరి మాట!!