ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేసిన రాఫెల్ యుద్ధ విమానాల్లో 5 విమానాలు బుధవారం భారత్కు చేరుకున్న సంగతి తెలిసిందే. అంబాలాలోని ఎయిర్బేస్లో రాఫెల్ జెట్స్ ల్యాండ్ అయ్యాయి. అయితే ఆ విమానాలను చూసి పాకిస్థాన్ భయపడింది. ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విషయంపై స్పందించింది.
భారత్ అవసరానికి మించి ఆయుధాలను, ఇతర సామగ్రిని సమకూర్చుకుంటుందని పాక్ విదేశీ మంత్రిత్వ వ్యవహారాల శాఖ వ్యాఖ్యానించింది. భారత్ ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడంపై ప్రపంచ దేశాలు స్పందించాలని కోరింది. భారత్ ఈ రకమైన చర్యలకు పాల్పడుతుండడం వల్ల దక్షిణాసియాలో అన్ని దేశాలు పెద్ద ఎత్తున ఆయుధ సంపత్తిని సమకూర్చుకునే పరిస్థితులు ఏర్పడుతాయని పేర్కొంది.
కాగా తాజా జెట్లతో భారత్ వద్ద ఉన్న మొత్తం జెట్ల సంఖ్య 538కు చేరుకోగా, పాక్ వద్ద అవి 356 మాత్రమే ఉండడం విశేషం. ఇక పాకిస్థాన్కు చెందిన ఎఫ్-16 ఫైటర్ జెట్లు, చైనాకు చెందిన జె-20 జెట్ల కన్నా రాఫెల్ యుద్ధ విమానాలు ఎంతో శక్తివంతమైనవి. ఇవి భూమిపై, సముద్రంపై జరిగే అటాక్లను తిప్పి కొడతాయి. అలాగే ఎన్నో టన్నుల సామర్థ్యం కలిగిన ఆయుధాలను అవలీలగా మోసుకెళ్లగలవు. భారత్ తెప్పించుకున్న రాఫెల్ యుద్ధ విమానాలను చూసి భయపడే పాక్ ఆ విధంగా వ్యాఖ్యలు చేసిందని నిపుణులు అంటున్నారు.