Ram Charan : సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన “ఉప్పెన” సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో రాజమండ్రిలో పెద్ద ఫంక్షన్ చేశారు. ఈ సందర్భంగా సినిమా యూనిట్ మొత్తం హాజరుకాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డైరెక్టర్ బుచ్చిబాబు పనితనాన్ని పొగిడారు.
గోదావరి జిల్లా నుండి ఎవరు వచ్చిన ఆదరిస్తారని మరోసారి బుచ్చిబాబు జీవితంలో రుజువైనట్లు, పుట్టిన ఊరికి పేరు తెచ్చినట్లు స్పష్టం చేశారు. హీరో వైష్ణవ తేజ్ గురించి అనేక విషయాలు చెప్పుకొచ్చారు. మొదటి సినిమాలోనే ఊహించని రీతిలో వైష్ణవి యాక్టింగ్ ఊహించని విధంగా ఉందని దానికి కారణం బాబాయ్ పవన్ కళ్యాణ్ అని తెలిపారు. వైష్ణవ్ తేజ్ సినిమా రంగంలోకి అడుగు పెట్టడానికి కారణం చిరంజీవి పవన్ అని చెప్పుకొచ్చారు. అయితే అందరికంటే ఎక్కువగా వైష్ణవ్ తేజ్ విషయంలో చొరవ తీసుకున్న వ్యక్తి మాత్రం బాబాయ్ పవన్ కళ్యాణ్ అని చెప్పుకొచ్చారు. యాక్టింగ్ విషయంలో మెళుకువలు నేర్చుకోవడానికి వైష్ణవి తేజ్ ని దగ్గరుండి ఇతర దేశాలకు పంపించింది పవన్ అని తెలిపారు. వైష్ణవ్ తేజ్ కి సినిమాలపై మంచి ఇష్టం ఉందని, మొదటి సినిమాలోనే ఈ రీతిలో పెర్ఫార్మెన్స్ ఇవ్వటం మామూలు విషయం కాదని తెలిపారు. పైకి అమాయకత్వం గా కనబడుతున్న గాని వైష్ణవ్ తేజ్ చాలా డిఫరెంట్ వ్యక్తి అని కొంచెం అందరూ జాగ్రత్తగా చూసుకోండి అంటూ అభిమానులను ఉత్సాహపరిచే రీతిలో రామ్ చరణ్ స్పీచ్ ఇచ్చారు. చిరంజీవి ఉప్పెన సినిమా కథ దాదాపు నాలుగు సార్లు వినటం జరిగిందని, తన సినిమా కథ కూడా ఇప్పుడు చిరంజీవి గారు అన్ని సార్లు వినలేదని.. వైష్ణవ్ తేజ్ అంటే అంత స్పెషల్ అంటూ ఖచ్చితంగా అభిమానులు ఆదరించాలని చెర్రీ తెలిపారు.
Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!