నియోజకవర్గాలను మార్చడం అనేది నాయకులకు అస్సలు నచ్చని వ్యవహారం. ఎందుకంటే.. ఒకటికి రెండు సార్లు ఓడినా.. ఒకే నియోజకవర్గాన్ని నమ్ముకుంటే.. కనీసం సింపతీ అయినా. తమను కాపాడు తుందని నమ్ముకుంటారు. ఇలా గెలిచిన వారు కూడా ఉన్నారు. అయితే, చిత్రంగా వైసీపీలోనే కాకుండా.. టీడీపీ లోకూడా మార్పుల దిశగా అధిష్టానాలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో తొలి అడుగు వేసింది వైసీపీనే.
దాదాపు 70 నియోజకవర్గాల్లో నాయకులను వేర్వేరు నియోజకవర్గాలకు బదిలీ చేసింది. దీనిని ఇష్టపడిన వారు కొనసాగుతున్నారు. లేని వారు తప్పుకొంటున్నారు. అయితే.. చిత్రం ఏంటంటే.. వైసీపీ ఇలా నియో జకవర్గాలను మార్చడాన్ని అనేక సందర్భాల్లో తప్పుబట్టిన టీడీపీ కూడా కొన్ని కొన్నినియోజకవర్గాల్లో మార్పుల దిశగానే అడుగులు వేసింది. మైలవరం, గురజాల, పెనమలూరు, నూజివీడు వంటి కీలక నియోజకవర్గాల్లో(స్వల్పంగా) మార్పులు చేసేందుకు రెడీ అయింది.
అయితే.. ఈ మార్పు పార్టీలకు ఏమేరకు మేలు చేస్తుంది? అనేది ప్రశ్న. పార్టీలకు ఒక వ్యూహం ఉంటుంది. అయితే.. దానిని ప్రజలకు వివరించి సక్సెస్ కావాలంటే.. టైం పడుతుంది. ఆ సమయం ఇప్పుడు అన్ని పార్టీలకూ తక్కువగానే ఉంది. ఈ నేథ్యంలో మార్పు మంచిదని భావిస్తున్నా.. జనాల్ని మెప్పించే వ్యూహాల దిశగా పార్టీలు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఇదిలావుంటే.. జనసేనలోనూ మార్పులు కనిపిస్తున్నాయి. పార్టీ అధినేత పవనే నియోజకవర్గం మార్చుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.
గత ఎన్నికల్లో భీమవరం, గాజువాకల నుంచి పోటీ చేసి ఓడిపోయిన.. ఆయన ఈ దఫా పిఠాపురం ఎంచు కుంటున్నారని టీడీపీ నేతలకు సంకేతాలు వచ్చాయి. అయితే.. ఇక్కడ పార్టీకి అండగా వర్మ ఉన్నారు. ఆయన పార్టీని బలోపేతం చేశారు. ఓటు బ్యాంకు చెదరకుండా.. వైసీపీ వ్యూహాలకు అడ్డుకట్టవేస్తూ.. ఎప్పటికప్పడు పార్టీ ని రక్షంచుకుంటూ వచ్చారు. మరిఈయనను పక్కన పెట్టి పవన్ కు టికెట్ ఇస్తే.. క్షేత్రస్థాయిలో మార్పు వల్ల ఒనగూరే ప్రయోజనం ఏంటనేది చూడాలి. సో.. మొత్తంగా చెప్పేది ఏంటంటే.. మార్పు విషయంలో అంతిమంగా ప్రజలను ఒప్పించాల్సి ఉందనే..!