అదేంటో రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నా.. అందరి చూపూ.. అందరి చర్చా.. అంతా పిఠాపురం వైపే ఉంది. ఏ ఇద్దరు కలుసుకుని మాట్లాడినా.. `పిఠాపురం ఎలా ఉంది బ్రో!` అనే టాకే వినిపిస్తోంది. ఇది వాస్తవం. ఎందుకంటే.. ఇక్కడ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీచేస్తుండడమే. అయితే.. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఆయనే స్వయంగా ప్రకటించినా.. బీజేపీ కనుక ఈసీటు కోరితే.. సోము వీర్రాజుకు ఇవ్వాలని పట్టుబడితే మాత్రం ఆయన త్యాగం చేయకతప్పదని అంటున్నారు.
తాజాగా బీజేపీలో జరుగుతున్న టికెట్ల చర్చల్లో పాల్గొన్న సోము వీర్రాజు పిఠాపురం మనం తీసుకుందాం అనేశారు. అంతే.. దీనిపై వెంటనే స్థానిక నేతల నుంచి పార్టీ ఆన్లైన్ నివేదికలు తెప్పించేసుకుంది. గతంలో ఒకసారి బీజేపీ ఇక్కడ గెలిచిన విషయం తెలిసిందే. దీనిని పట్టుకుని కాపు సామాజిక వర్గం ఎక్కు వగా ఉన్న ఈ నియోజకవర్గం మనం తీసుకుందామన్న ప్రతిపాదనకు అధిష్టానం దాదాపు జై కొట్టినట్టు తెలుస్తోంది.
అందుకే బహుశ పవన్ ఇక్కడ నుంచిపోటీ చేయాలని భావించిన ఉదయ్ను కాకినాడకు పంపించారు. ఇదేసమయంలో తన పోటీపైనా.. సందేహం వ్యక్తం చేశారు. కాగా. తాజా అంచనాల ప్రచారం.. బీజేపీ తీసుకునే సీట్లలో రెండు నుంచి నాలుగు చోట్ల మార్పులు ఖాయమని అంటున్నారు. వీటిలో విశాఖప ట్నం ఎంపీ సీటు కూడా ఉండబోతోందని సమాచారం. దీని మాట ఎలా.. ఉన్నప్పటికీ.. పిఠాపురం మాత్రం బీజేపీ వదులుకునే పరిస్థితి లేదని చెబుతున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సీట్ల వ్యవహారంలో బీజేపీ రెండు స్ట్రాటజీలు లెక్కలోకి తీసుకుంది.
1) తాము సొంతగా గతంలో గెలిచిన సీట్లు తీసుకోవడం. 2) టీడీపీ-జనసేన బలంగా ఉండి.. గెలుస్తారని అంచనా వేసుకున్న సీట్లను తీసుకోవడం. ఈ రెండు ప్రాతిపదికలే కేంద్రంగా బీజేపీ పావులు కదుపుతోం ది. ఈ నేపథ్యంలో సోము నోటి నుంచిపిఠాపురం అనే మాట వచ్చిందని.. ఆ వెంటనే ఈ నియోజకవర్గంపై పార్టీ అధిష్టానం నివేదికలు తెప్పించుకుందని తెలుస్తోంది. ఇక, విశాఖ సీటు వెనుక.. కూడా టీడీపీ బలంగా ఉండడమే కారణమని అంటున్నారు. మొత్తంగా పిఠాపురం అయితే.. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు.. బీజేపీకే దక్కే అవకాశం కనిపిస్తోంది.