భారత మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమంగా ఉందన్న విషయం తెల్సిందే. ఆయన చనిపోయారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. సెలబ్రిటీలు కూడా ఈ విషయంలో ఫేక్ న్యూస్ ను నమ్మేసి ప్రణబ్ ముఖర్జీకి నివాళులు అర్పిస్తున్నారు.
దీనిపై ప్రణబ్ ముఖర్జీ తనయుడు అభిజిత్ ముఖర్జీ మండిపడ్డారు. మా నాన్న బ్రతికే ఉన్నారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ను నమ్మకండి. పేరున్న జర్నలిస్టులు కూడా ఈ ఫేక్ న్యూస్ ను ప్రచారం చేయడం బాధాకరం అని అభిజిత్ అభిప్రాయపడ్డారు. అలాగే ఇండియా ఫేక్ న్యూస్ కు ఫ్యాక్టరీగా మారిందని దుయ్యబట్టారు. ఆయన రక్తప్రసరణ నిలకడగా ఉంది. మీ అందరి ప్రార్థనలతో ఆయన త్వరగా కోలుకుంటారని ఆశిద్దాం అని అభిజిత్ ట్వీట్ చేసారు.