ముంబాయి. ఫిబ్రవరి 2: కొరెగావ్ భీమా కేసులో ప్రజా మేధావి, ప్రొఫెసర్ ఆనంద్ తెల్తుంబ్డేను అరెస్టు చేసిన పూనా పోలీసులకు కోర్టులో చుక్కెదురయింది. నాలుగు వారాల పాటు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమలో ఉండగానే ఆయనను అరెస్టు చేసి పూనా సెషన్స్ కోర్టులో హాజరు పరిచారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో ఉన్న రక్షణ ఈ నెల 11 వతేదీ వరకూ ఉందని తేల్తుంబ్డే న్యాయవాది కోర్టు దృష్టికి తీసువచ్చారు. సెషన్స్ కోర్టు తేల్తుంబ్డేను విడుదల చేయల్సిందిగా ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు పానా పోలీసులు ఆయనను తక్షణం విడుదల చేశారు.
శనివారం తెల్లవారుజాము ముంబాయి పోలీసులు తేల్తుంబ్డేను అరెస్టు చేశారు. ముంబయి ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు.
ముంబాయి విమానాశ్రయంలో ఇన్స్పెక్టర్ ఇందూల్కర్ ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఆయనను పూనా పోలీసులకు అప్పగించారు.
జనవరి 14న సుప్రీం కోర్టు ఆనంద్ తెల్తుంబ్డే దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను తిరస్కరించింది.
శుక్రవారం ఫిబ్రవరి ఒకటిన పూనా కోర్టు అనంద్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది.
తన న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించనున్నారని,, అవకాశం కల్పించాలని ఆనంద్ పోలీసులను అభ్యర్థించినా పూనా కోర్టు బెయిల్ పిటిషన్ను తిరస్కరించినందున అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
అనంద్ తో పాటు మరో తొమ్మిది మంది మేధావులపై ప్రధాని నరేంద్ర మోదిని చంపేందుకు కుట్ర పన్నుతున్నారని కేసు నమోదు అయి ఉంది.