పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న సినిమా “రాధే శ్యామ్”. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఇప్పటికే దేశ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ నెలకొన్న సంగతి తెలిసిందే. యువి క్రియోషన్స్, గోపికృష్ణ మూవీస్ కలిసి దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
కాగా ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి కేవలం టైటిల్ పోస్టర్ తో కూడిన ప్రభాస్, పూజ హెగ్డే ల ఫస్ట్ లుక్ మాత్రమే రిలీజ్ చేశారు. కాని ఫ్యాన్స్ కి ఇవ్వాల్సిన భారీ గిఫ్ట్ మాత్రం చిత్ర బృందం ఇప్పటి వరకు ఇవ్వలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి ఫ్యాన్స్ కి ఒక బిగ్ సర్ప్రైజ్ ఇవ్వడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారట.
అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా “రాధే శ్యామ్” సినిమా నుంచి ఫ్యాన్స్ థ్రిల్లయ్యే టీజర్ ని రిలీజ్ చేయబోతున్నారట చిత్ర యూనిట్. ఇప్పటికే రాధే శ్యామ్ యూనిట్ టీజర్ ను కట్ చేసి.. ఆర్ ఆర్ మిక్సింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటి వరకు ఈ సినిమా సంగీత దర్శకుడు ఎవరన్నది పక్కాగా క్లారిటీ లేదు. ఎం.ఎం.కీరవాణి అని.. థమన్ అని.. జిబ్రాన్ అని సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది.
కాని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం డార్లింగ్ ప్రభాస్ “రాధే శ్యామ్” కి అమిత్ త్రివేది ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ చేసుకున్నారట. ఆయన ఇచ్చే ఆల్బం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి పెద్ద హైలెట్ అని అంటున్నారు. ఇప్పటికే అమిత్ త్రివేది మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డికి సంగీతమందించి మంచి పేరు సంపాదించుకున్నాడు. మొత్తానికి ప్రభాస్ మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో ఫ్యాన్స్ కి పెద్ద గుడ్ న్యూస్ చెప్పినట్టే. త్వరలో ఇందుకు సంబంధించిన అధికారక ప్రకటన రానుందట.