త్వరలోనే జరగనున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఏపీలో పుంజుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ అన్ని వ్యూహాలకూ పదును పెంచుతోంది. 2014లో ఎక్కడైతే.. నామరూపాలు లేకుండా పోయిందొ.. అక్కడే పార్టీ పుంజుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో అనూహ్యంగా వైఎస్ కుమార్తె షర్మిలను రంగంలోకి దింపిన కాంగ్రెస్ పెద్దలు.. అక్కడితో పనిముగించలేదు. ఇప్పుడు కీలకమైన నాయకులను కూడా ఏపీకి పంపుతోం ది. వారితో ప్రచారం చేయిస్తోంది.
సోమవారం నుంచి వరుసగా.. ప్రాంతీయ సమన్వయ కమిటీల సమావేశాలకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది. వీటితోపాటు.. మూడు ప్రాంతాల్లో (ఉత్తరాంధ్ర-కోస్తా-రాయలసీమ) భారీ బహిరంగ సభలకు కూడా తెరదీ సింది. ఈ క్రమంలో ఆయా సభలకు అతిరథ మహారథులు వంటి జాతీయ నాయకులతోపాటు..పొరుగున ఉన్న కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులను కూడా ల్యాండ్ చేయిస్తోంది. వారి ప్రసంగాలు.. ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న సంక్షేమం వంటివాటిపై కాంగ్రెస్ దృష్టి పెట్టనుంది.
కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు, ఏడు హామీలను అమలు చేస్తున్న విషయం తెలి సిందే. దీంతో ఆయా రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పుంజుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోఅలాంటి పథకాలనే ఏపీలోనూ అమలు చేస్తామని చెప్పడం ద్వారా..ఇక్కడ పునాదులు వేసుకునేందుకు ప్రయత్నాలు చేపడుతోంది. ముఖ్యంగా ఏపీకి ప్రధాన డిమాండ్లుగా ఉన్న పోలవరం నిర్మాణం, ప్రత్యేకహోదా, విశాఖ స్టీల్ కర్మాగారాన్ని ప్రైవేటు పరంగా చూడడం కాంగ్రెస్ అజెండాలో కీలకంగా ఉన్నాయి.
ఇదేసమయంలో ఇతర హామీలైన.. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాలను ప్రకటించాలని అనుకున్నా.. ఇప్పటికే దీనిని టీడీపీ-జనసేన కూటమి తీసేసుకుంది. ఈ నేపథ్యంలో మరిన్ని పథకాలకు కాంగ్రెస్ శ్రీకారం చుట్టే అవకాశం కనిపిస్తోంది. ఇదిలావుంటే.. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కర్ఱాటన ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్లు ఏపీకి స్టార్ క్యాంపెయినర్లుగా మారనున్నారు. మరి ఏమేరకు ఫలితం దక్కుతుందో చూడాలి.