Discovery: సృష్టిలో కంటికి కనబడని ప్రపంచం చాలా ఉందని.. మానవ కంటికి కనబడుతుంది వందలో 10 శాతం మాత్రమే అని శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా సముద్ర భూభాగంలో రకరకాల కొత్త జీవులు ఉంటాయని.. చెప్పటం మాత్రమే కాక అప్పుడప్పుడు ఆ జీవులని సైంటిస్టులు బయటకి వెలికి తీస్తూ ఉంటారు. ఇక ఇదే సమయంలో ఏలియన్స్ గురించి కూడా రకరకాల వార్తలు అప్పుడు అప్పుడు వస్తూ ఉంటాయి. వాళ్లు కూడా ఎదో గ్రహంలో ఉన్నారని… అప్పుడప్పుడు భూమి మీదకి వచ్చి వెళ్తున్నారని అమెరికా.. ఇంకా పాశ్చాత్యదేశాల మీడియా కథనాలు ప్రసారం చేస్తూ ఉంటాయి. ఈ తరహాలోనే ఎప్పటినుండో నియాండర్తల్స్ అనే వైవిధ్యమైన మానవజాతి భూమి పై ఉండేదని వాళ్లు మనుషుల మాదిరిగానే ఉండేవారిని ఎప్పిటినుండో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
దాదాపు 40 వేల సంవత్సరాల క్రితం ఈ జాతి భూమి మీద ఉందని కాలక్రమేణా వాళ్లు అంతరించి పోయారు అని టాక్. ఖైదీ ఆ సమయంలో ఆ జాతికి సంబంధించి అనేక తవ్వకాలు… రకరకాల పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో పరిశోధనలో భాగంగా తాజాగా ”పీఎన్ఓఎస్ వన్” అనే జర్నల్ లో దీనికి సంబంధించిన ఆసక్తికర విశ్లేషణ బయటికి రావడం జరిగింది. వస్తున్న వార్తల సారాంశం ప్రకారం..నియాండర్తల్స్ జాతి భూమిపై అంతరించి పోవడానికి గల కారణం మానవ జాతితో శారీరక సంబంధాలు కలిగి ఉండటమేనని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఎంతో బలమైన శరీర దృఢత్వం కలిగిన ఈ జాతి మానవ జాతితో పెట్టుకున్న శారీరక సంబంధాల వల్ల మొత్తం లక్ష సంవత్సరాలలో మొత్తం అంతరించిపోవడం జరిగిందని ఈ పరిశోధనలో తేలింది. ఆధునిక మానవుడికి ముందుతరం గా పిలవబడే నియాండర్తల్స్ జాతి.. రూపురేఖలు మానవ జాతికి దాదాపు 90 శాతానికి పైగానే ఒకేలా ఉంటాయని… శాస్త్రవేత్తలు తెలియజేశారు. పుర్రే… శరీరం మనిషి మాదిరిగానే ఉంటుంది, ఆదిమానవుడు కనిపెట్టిన రీతిలోనే వాళ్లు కూడా నిప్పు కనిపెట్టడం జరిగింది అని.. శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఆదిమానవులు మాదిరిగానే రాతిపై బొమ్మలు చెక్కడం సముద్రంలో దొరికే గవ్వలు.. ముత్యాలు వంటివాటితో..నియాండర్తల్స్ జాతి… ఆభరణాలు తయారు చేసుకునే వారట. అంతేకాకుండా తమపై దాడి చేసే వారిపై ఖచ్చితంగా ప్రతి దాడి చేయటం, ఆహారం విషయానికి వస్తే గొర్రెలు.. దుప్పిలు.. అడవి దున్నలు.. ఖడ్గ మృగాలు లాంటి జంతువుల్ని వేటాడి.. తినిన తరువాత… వాటికి సంబంధించిన ఎముకలతో ఆయుధాలు తయారు చేసుకునే వారట. నియాండర్తల్స్ జాతి మంచి వేటాడే నైపుణ్యం కలిగినవారు. తమ జాతి పై కుటుంబం పై గానీ ఎవరైనా గొడవకు దిగితే.. ఖచ్చితంగా వారి అంతు చూడనిదే ఈ జాతి నిద్రపోయేది కాదట.
భూమిపై ఆ రకంగా మనిషి మాదిరిగా బతికిన ఈ జాతి అంతరించి పోవడానికి గల ప్రధాన కారణం ఆఫ్రికా ఖండంలో మానవ జాతి తో.. పెట్టుకున్న శారీరక సంబంధం వల్ల….నియాండర్తల్స్ లో.. కొత్త రకం వ్యాధి పుట్టి ” హెమోలిటిక్ డిసీజ్ ఆఫ్ ది ఫీటెస్ అండ్ న్యూబార్న్” (హెచ్ డీ ఎఫ్ఎన్)బలహీనత ఉందని.. అది రక్తహీనతకి దారితీసి.. మరింతగా ఆ జాతిలో ఉధృతంగా సోకి ..హెమోలిటిక్ డిసీజ్ తో నియాండర్తల్స్… ఈ భూమి పై కనుమరుగవడం జరిగింది అని తాజా శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది అనే విశ్లేషణ తాజాగా బయటపడింది. శారీరకంగా కలవడం వల్లే ప్రధానంగా ఈ జాతి అంతమై పోయిందట.