శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకోంది. మందస మండలం కొత్తపల్లి వద్ద ఉన్న వంతెన పై నుంచి ఓ కారు కిందకు బోల్తా కొట్టింది. విశాఖపట్నం నుంచి బరంపూర్ వైపు వెళుతున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు,ఇద్దరు పురుషులు, ఒక చంటి పాపతో పాటు మొత్తం ఆరుగురు ఘటన స్థలంలో ప్రాణాలు విడిచారు.
డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన ఒడిసా వాసులుగా గుర్తించారు. ప్రమాదానికి అతి వేగమే కారణమని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన ఒడిసా వాసులుగా గుర్తించారు. ప్రమాదానికి అతి వేగమే కారణమని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.