(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: ఏపి రాజధానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిఎన్ రావు, బిసిజి కమిటీల నివేదికపై మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జిఎన్ రావు కమిటీలో ఉన్న అంశాలను అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ ముందే ప్రస్తావించారన్నారు. బిసిజి కమిటీ అంశాలను మంత్రులు ముందే వెల్లడించారన్నారు. కమిటీల నివేదికల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండగా వీరి చర్యలు కమిటీల విశ్వసనీయతను దెబ్బతీశాయని వ్యాఖ్యానించారు. రేపు న్యాయస్థానాలలో ఇవి ఇబ్బందికర పరిణామాలను కలుగచేయవచ్చని ఐవైఆర్ అభిప్రాయపడ్డారు.
ఈ కమిటీల విశ్వసనీయతపై ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం విమర్శలు చేస్తూనే ఉంది. జిఎన్ కమిటీ నివేదిక బహిర్గతం కాకముందే సిఎం జగన్ అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేయడంపై ప్రతిపక్షాల నుండి విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా రిటైర్డ్ సిఎస్ ఐవైఆర్ కృష్ణారావు కూడా ప్రభుత్వ పెద్దల చర్యలను తప్పుబడుతూ ట్వీట్ చేశారు.
జిఎన్ రావు కమిటీలో ని అంశాలను ముఖ్యమంత్రి గారు ముందే ప్రస్తావించారు. బీసీజీ కమిటీ అంశాలను మంత్రులు ముందే ప్రస్తావించారు. ఈ నివేదికల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి. కానీ పై చర్యలు కమిటీల విశ్వసనీయతను దెబ్బతీశాయి. రేపు న్యాయస్థానాలలో ఇవి ఇబ్బందికర పరిణామాలను కలుగ చేయవచ్చు. pic.twitter.com/WFaYkcq0se
— IYRKRao , Retd IAS (@IYRKRao) January 4, 2020