Mumbai : ‘కొత్త బంగారులోకం’ చిత్రంతో మొదటి సినిమాలోనే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన శ్వేతాబసుప్రసాద్ ఆ తర్వాత ప్రజలను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తర్వాత కొద్ది సినిమాల్లో నటించినా ఆమెకు అంతగా పేరు రాలేదు. ఆ తర్వాత సెక్స్ రాకెట్లో చిక్కుకోవడంతో ఇబ్బందుల పాలయిం.ది చాలా కాలం కొనసాగిన కేసులో చివరికి నిర్దోషిగా బయటపడిన ఆమెకు ఆ తర్వాత సరైన బ్రేక్ రాలేదు.
2018 లో బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్ ను శ్వేత ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ సంవత్సరంలోనే వారి విడాకులు కూడా అయిపోయింది. అప్పటినుండి కనిపించని శ్వేతా బసు ప్రసాద్ తాజాగా హిందీలో ‘ఇండియా లాక్ డౌన్’ అనే ఒక సినిమాలో నటిస్తుంది. లాక్ డౌన్ సమయంలో ఏయే రంగాల్లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనే పాయింట్ పైన ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మధుర్ బండార్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఇక లాక్ డౌన్ వల్ల అన్ని రంగాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ముంబయిలోని రెడ్ లైట్ ఏరియా ప్రాంతంలో నివసించే సెక్స్ వర్కర్లు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీరి కథలు చాలా రియాల్టీ గా చూపించేందుకు చిత్రయూనిట్ ముంబై రెడ్ లైట్ ఏరియా లో ని కామాటిపుర ని సందర్శించారు. ఇక వారితో పాటు శ్వేతాబసుప్రసాద్ కూడా అక్కడికి వెళ్ళింది.
తాను చేసే పాత్రలని నిజమని నమ్మినప్పుడే నేను వాటిలో లీనమైపోతాను అని చెప్పిన శ్వేతాబసుప్రసాద్ తన పాత్ర ఇంకా మెరుగ్గా వచ్చేందుకు తన టీంతో కలిసి రెండు వారాలు కి వెళ్లినట్లు చెప్పింది. వారిని చూసి ఆ సినిమాలో లో మాట్లాడాలి… ఏ యాస లో మాట్లాడాలి అనేది తెలుసుకున్నట్లు… వారి జీవితాలు ఎలా ఉంటాయి? ఆలోచనా విధానం ఎలా ఉంటుంది? అనే విషయాల గురించి స్టడీ చేసినట్లు చెప్పింది.
ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే తను పోషిస్తున్న mehrunissa (మెహ్రున్నీసా) పాత్రను స్వయంగా కలిసినట్లు శ్వేతాబసుప్రసాద్ చెప్పింది. అచ్చంగా నేను చేయబోయే పాత్ర నా కళ్ళముందు కనిపించినట్లు ఉంది. ఈ సినిమాలో నా పాత్ర ను ఆమెకు అంకితం ఇస్తున్నాని అని చెప్పింది శ్వేత. బాలీవుడ్ సెక్స్ వర్కర్ల సమస్యలపై ఎన్నో సినిమాలు వచ్చాయి మరి శ్వేతాబసుప్రసాద్ ఈ చిత్రంలో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.