Video Viral: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ (ఆలపాటి రాజా) షాక్ ఇచ్చారు. గుంటూరు జిల్లా చేబ్రోలులోని వడ్లమూడి జరిగిన రా కదలిరా సభలో ఆలపాటి రాజా టంగ్ స్లిప్ అయ్యారు. రాజా సభలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని పొగుడుతూ మాట్లాడారు.
ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయగలిసిన సత్తా ఉన్న నాయకుడు వైఎస్ జగన్ అంటూ రాజా మాట్లాడటంతో సభలో ఉన్న చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు ఒక్క సారిగా అవాక్కయ్యారు. రాజా వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కొందరు రాజకీయ నాయకులు మైక్ పట్టుకోవడంతో ఆవేశంతో ఏదోఏదో మాట్లాడుతుంటారు. తమ నాయకుడిని పొగడ్తలతో ముంచెత్తాలని, ప్రత్యర్ధి నాయకులను విమర్శించాలని అనుకుంటుంటారు. కానీ ఒక్కో సందర్భంలో ఆవేశంలో టంగ్ స్లిప్ అయి ప్రత్యర్ధి పార్టీ నేతలను పొగడటం, స్వపక్ష నాయకులనే విమర్శించేలా మాట్లాడటం జరుగుతుంటుంది. అలానే అలపాటి రాజా ప్రసంగిస్తున్న సమయంలో టంగ్ స్లిప్ అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబే రావాలి అంటూ సరి చేసుకున్నారు.
మరో పక్క టీడీపీ అధినేత చేపట్టిన రా కదలిరా సభకు జనం ముఖం చాటేస్తున్నారు. భారీ గా జన సమీకరణ చేయాలని పార్టీ హైకమాండ్ నుండి ఆదేశాలు వస్తున్నా అభ్యర్ధుల ప్రకటన చేయకపోవడంతో ఎవరు బాధ్యత తీసుకోవాలన్నదానిపై స్పష్టత లేకపోవడంతో ఆశావహులు జనసమీకరణపై దృష్టి పెట్టడం లేదని అంటున్నారు.
దీంతో టీడీపీ నేతలు ఊహించినంత మంది పాల్గొనడం లేదని సమాచారం. సభకు వచ్చిన వారిలో కూడా చాలా మంది చంద్రబాబు ప్రసంగిస్తుండానే సభ నుండి వెళ్లిపోవడం కనిపించింది. సోమవారం రాజమహేంద్రవరం రూరల్ కాతేరు. పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు లో రా కదలిరా సభలు జరిగాయి.
Chandrababu: బాబు కీలక ప్రకటన .. ఆశావహుల్లో ఆందోళన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఏకైక నాయకుడు సీఎం వైయస్ జగన్.
-టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా
ఎట్టకేలకు నిజం ఒప్పుకుంటున్న @JaiTDP నాయకులు. ఇక చంద్రబాబు కూడా నిజం ఒప్పుకోవాలి, నిజాన్ని గెలిపించాలి! 😄#YSJaganDevelopsAP#EndOfTDP pic.twitter.com/vTAe6U2G9m
— YSR Congress Party (@YSRCParty) January 29, 2024