కడప: జమ్మలమడుగు నియోజకవర్గంలో పోలీస్ బందోబస్తు మధ్య వైసిపి నేతలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కడప సిట్టింగ్ ఎంపి, వైసిపి లోక్సభ అభ్యర్థి అవినాష్ రెడ్డి, జమ్మలమడుగు వైసిపి నేత సుధీర్రెడ్డిలు గురువారం సుగమంచిపల్లె గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా పలువురు వీరి ప్రచారాన్ని అడ్డుకున్నారు. ఉద్రిక్త పరిస్థితి ఏర్పడటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలకు సర్ధి చెప్పి పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం పోలీస్ బందోబస్తు నడుమ వైసిపి నేతలు ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు.
మంత్రి ఆదినారాయణ రెడ్డి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఈ నియోజకవర్గంలో వైరివర్గాలుగా ఉన్న మంత్రి ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిలు టిడిపిలో కొనసాగుతున్నారు.ఇద్దరి నేతల మధ్య టిడిపి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు సయోధ్య కుదిర్చారు. ఇరు వర్గాల నేతలు కలిసి ప్రయాణం చేస్తుండటంతో వీరి ఆధిపత్యానికి అడ్డులేకుండా ఉంది.