సుఖపెట్టలేని భర్త ..ఆ విషయం చెబితే నీచంగా మాట్లాడిన అత్తమామలు… తట్టుకోలేక ఆ ముగ్గురిని కాల్చి చంపానని చెప్పిన కోడలు! ఇదండీ చెన్నైలో జరిగిన మూడు హత్యల కేసు వెనక ఉన్న అసలు కథ!థ్రిల్లర్ సినిమాను మరిపించే రీతిలో ఈ రియల్ సంఘటన జరిగింది.
ఈ నెల పన్నెండో తేదీన చెన్నైలో ముగ్గురిని కాల్చి చంపిన సంఘటన సంచలనం రేపటం తెలిసిందే.పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ ఘోరమైన నేరానికి పాల్పడింది జయమాల అనే మహిళ అని తేల్చేశారు.ఈ కేసులో జయ మాలతో పాటు ఆమె తమ్ముడు కైలాష్ మరో ఇద్దరిని పోలీసులు అతి కష్టమ్మీద అరెస్టు చేశారు.తదుపరి పోలీసులు వారిని విచారించగా జయమాల ఇంత ఘాతుకానికి ఎందుకు పాల్పడిందో స్పష్టంగా చెప్పేసింది. రాజస్థాన్ కు చెందిన దలీల్ చంద్ ఆయన భార్య పుష్పాబాయ్ దంపతులు 40 ఏళ్ల క్రితం చెన్నై కి వచ్చేసారు. చెన్నైలోని ఎలిఫెంట్ గేట్ సమీపంలోని వినాయక మిస్రీ స్ట్రీట్ లోని ఆపార్ట్ మెంట్ లో నివాసముంటున్నారు. దలీల్ చంద్ కు కుమారుడు సీతల్ కుమార్ ,పింక్ అనే కుమార్తె ఉన్నారు. దలీల్ చంద్ అతని కొడుకు సీతల్ కలిసి చెన్నైలోని షావుకారు పేటలో ఫైనాన్స్ కంపెనీ నిర్వహిస్తున్నారు.
సీతల్ కు మహారాష్ట్రలోని పూణేకి చెందిన జయమాల అనే మహిళకు 14 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి 13 ఏళ్లు 11 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరుకుమార్తెలు ఉన్నారు.అయితే వారి మధ్య వయసు తేడా అధికంగా ఉండటంతో పాటు జయమాల శారీరక కోర్కెలను శీతల్ తీర్చలేకపోయిన నేపధ్యంలో రెండేళ్ల క్రితం భార్య అతడిని వదిలేసి పుణేలోని పుట్టింటి కివెళ్లిపోయింది.భర్త అత్తమామలపై గృహహింస కేసు పెట్టింది. ఏడుకోట్ల రూపాయల భరణం అడుగుతూ కోర్టుకెక్కింది.విడాకులు ఇవ్వడానికి సిద్ధపడ్డ సీతల్ భరణం మాత్రం అన్ని కోట్లు ఇవ్వనని తేల్చి చెప్పేశాడు. రెండు నెలల క్రితమే జయమాల ఆమె సోదరుడు కైలాష్ మరో యువకుడు సీతల్ ఇంటికి వచ్చి భరణం ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరించి వెళ్లారు.
దీనిపై శీతల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారి మీద కేసు నమోదైంది.అప్పటినుండి వివాదం ఇంకా ముదిరింది ఈ నేపథ్యంలోనే జయమాల ఆధ్వర్యంలో ఒక గ్యాంగ్ సీతల్ ఇంటికి వెళ్లి భర్త అత్తమామలను కాల్చి చంపేసింది. సంచలనం రేపిన ఈ హత్య కేసు విచారణ లో ఒకే ఒక్క విషయం తేలిందని ..కేవలం భర్త సుఖ పెట్టలేకపోవడం ఆ బాధను అత్తమామలకు చెప్పుకోబోగా వారు కూడా నీచంగా మాట్లాడ్డంతోనే జయమాల ఈ మూడు హత్యలకు పాల్పడిందని ఉన్నతస్థాయి పోలీసు వర్గాలు తెలిపాయి. ఇదే విషయాన్ని జయమాల తమ దర్యాప్తులో స్పష్టంగా చెప్పిందన్నారు.ప్రస్తుతం చెన్నైలో ఈ హత్యలే హాట్ టాపిక్ గా మారాయి.