ఏపీలో ఏమీ లేదని అనుకుంటున్న రెండు పార్టీలకు.. స్టార్ క్యాంపెయినర్లు సిద్ధంగా ఉన్నారు. ఇటు కాంగ్రె స్, అటు బీజేపీల పక్షాన.. ఏపీలో దుమ్మురేపే ప్రచారానికి తెలంగాణకు చెందిన ఇద్దరు కీలక నేతలకు.. ఆయా పార్టీలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలిసింది. కాంగ్రెస్ తరఫున.. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి.. ఏపీలో పర్యటనలకు రెడీ అయ్యారు. మొత్తంగా ఇప్పటి వరకు ఉన్న షెడ్యూల్ ప్రకారం. రేవంత్.. నాలుగు సభల్లో పాల్గొననున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నెల 15న విశాఖలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే భారీ బహిరంగ సభలో రేవంత్ పాల్గొంటారు. ఇది తొలి అ డుగు. తర్వాత.. ఆయన తిరుపతి, కర్నూలు, విజయవాడలలో నిర్వహించే భారీ సభలకు హాజరు కానున్నా రు. ఈ మేరకు పార్టీకి షెడ్యూల్ ఖరారైంది. అంటే ఏపీ కాంగ్రెస్కు బలమైన ప్రచార కర్త లభించినట్టే.. ఏపీలో వాస్తవానికి ఏమీ లేని కాంగ్రెస్ .. ఇటీవల వైఎస్ తనయ షర్మిల పగ్గాలు చేపట్టాక.. మార్పు కనిపించింది. కార్యకర్తల సమీకరణలు, నాయకుల రాకలు పెరిగాయి.
ఈ నేపథ్యానికి రేవంత్ కలిసి వచ్చే అవకాశం మెండుగా ఉంది. ఇది పార్టీకి ప్లస్ కానుంది. ఇక, బీజేపీని చూ సుకుంటే.. ఏపీలో బీజేపీకి బలమైన ప్రచార గళం అంటూ ఏమీ లేదు. ఉన్నప్పటికీ.. ఎవరి వాదన వారిదే అన్నట్టుగా ఉంది. కలసి కట్టుగా నాయకులు ప్రస్ మీట్ పెట్టింది లేదు. ఒక భారీ బహిరంగ సభను నిర్వహిం చింది కూడా లేదు. పోనీ.. బలంగా వాయిస్ వినిపించేవారు కూడా ఎవరూ లేరు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు బలమైన నాయకత్వం అవసరం ఉంది.
పోనీ.. నాయకత్వం మాట ఎలా.. ఉన్నప్పటికీ బలమైన ప్రచార కర్త అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణకు చెందిన ఎంపీ.. బండి సంజయ్పై బీజేపీ అగ్రనేతల చూపు పడింది. ఈయనను ఏపీలో వాడుకునేందుకు దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఎన్నికల ప్రచారానికి ఆయన ప్రధాన మోడీతో కలిసి ఈ నెల 17న ఏపీకి రానున్నారు. ఇక, అప్పటి నుంచి ఈయన కూడా. నాలుగు సభల్లో పాల్గొననున్నట్టు సమాచారం. ఇదే జరిగితే.. అటు కాంగ్రెస్ పక్షాన రేవంత్, ఇటు బీజేపీ పక్షాన బండి దంచి కొట్టడం ఖాయమంటున్నారు పరిశీలకులు.