అనుష్క శెట్టి లేటెస్ట్ సినిమా ఎప్పుడు అనౌన్స్ చేస్తుందో అని అనుష్క అభిమానులు అలాగే ఇండస్ట్రీ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి – బిగినింగ్, బాహుబలి – కన్క్లూజన్, భాగమతి సినిమాలతో భారీ సక్సస్ లను అందుకున్న anushka setty ఆ తర్వాత నిశ్శబ్ధం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. కోన వెంకట్ నిర్మించాడు. ఈ సినిమాకి టాలెంటెడ్ డైరెక్టర్ హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించాడు. మాధవన్, అంజలి, శాలినీ పాండే కీలక పాత్రలు పోషించారు. పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కిన నిశ్శబ్ధం భారీ అంచనాలతో థియేటర్స్ ఓపెన్ కాకపోయినా ఓటీటీలో రిలీజ్ చేశారు.
అన్ని అంచనాల మధ్య రిలీజైన anushka setty నిశ్శబ్ధం ఫ్లాప్ ని మూటగట్టుకుంది. చెప్పాలంటే అనుష్క నిశ్శబ్ధం విషయంలో బాగా డిసప్పాయింట్ అయింది. ఇక ఈ సినిమా తర్వాత మళ్ళీ ఇంతవరకు కొత్త సినిమాని అనౌన్స్ చేయలేదు. కాగా anushka setty నటించబోయే నెక్స్ట్ సినిమా గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రారా కృష్ణయ్య సినిమాతో దర్శకుడిగా మారిన పి.మహేష్ దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ని కోన వెంకట్ సపోర్ట్ తో అనుష్క శెట్టి ఒకే చేసిందని చెప్పుకుంటున్నారు.
అయితే anushka setty ఇప్పటి వరకు ఏ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇవలేదని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. అటు తమిళం గాని ఇటు తెలుగులో గాని అనుష్క శెట్టి ఏ కొత్త సినిమాకి సైన్ చేయలేదట. ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్నవన్ని పూర్తిగా ఫేక్ న్యూస్ అని తాజా సమాచారం. కాగా ఇటీవల గుణశేఖర్ శాకుంతలం లో అనుష్క నటించబోతున్న వార్తలు కూడా వచ్చాయి. కాని శాకుంతలం లో సమంత నటిస్తుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మొత్తానికి anushka setty నుంచి కొత్త సినిమా రాబోతుందని ఎదురు చూస్తున్న అభిమానులకి మరికొన్ని రోజులు ఈ ఎదురు చూపులు తప్పవు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!