టీడీపీ-జనసేన పార్టీలు ఉమ్మడి జాబితా ప్రకటించి.. పట్టుమని వారం కూడా కాకుండానే.. భారీ సభ నిర్వ హించారు. తాడేపల్లిగూడెం శివారులో నిర్వహించిన ఈ సభకు భారీ ఎత్తున జనాలు తరలి వచ్చారు. అయితే.. ఒకవైపు.. ఈ పొత్తు ఇంకా కుదురుకోలేదని.. ఇరు పార్టీల మధ్య క్షేత్రస్తాయిలో కలివి కనిపించ డం లేదని.. ముందుగా ఆ దిశగా అడుగులు వేయకుండా..ఇలా సభలు పెట్టి గగ్గోలు పెడితే ప్రయోజనం ఏంటనే చర్చ తెరమీదకి వచ్చింది.
వైసీపీ అనుకూల మీడియాలు, సహా పలువురు మంత్రులు కూడా ఇలానే వ్యాఖ్యలు చేస్తున్నారు. `గ్రౌండ్ లెవిల్లో .. పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పుడు సభలు ఎందుకు? ఇదొక స్టంటు` అని వైసీపీ ముఖ్య నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఇలాంటి వాదనలు, వ్యాఖ్యలు చాలా మంది నుంచి వినిపిస్తున్నా యి. అయితే.. ఇలా జాబితా రూపొందించిన వెంటనే మహా సభనిర్వహించడం ద్వారా.. చాలా వ్యూహాత్మ కంగా మిత్రపక్షాలు ముందుకు కదులుతున్నాయని ఈ పార్టీల నేతలు చెబుతున్నారు.
`నిజమే. క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య కలివిడి సమస్యగా ఉంది. అయితే.. దీని కోసం ఒకవైపు ప్రయ త్నాలు చేస్తూనే మరోవైపు, సభలు నిర్వహించడం ద్వారా అంతర్గతంగా పార్టీల మధ్య ఉన్న ఇబ్బందుల ను తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ నేపథ్యంలోనే సభలకు ప్లాన్ చేస్తున్నాం.` అని జనసేన ముఖ్య నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఇక, పొత్తుల విషయంపై క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్త ల మధ్య సయోధ్యను కుదర్చడం కూడా.. సభల ఉద్దేశంగా మారింది.
ఇక, ప్రజల్లోనూ .. ముఖ్యంగా సామాజిక వర్గాల పరంగా చూసుకుంటే,కాపు వర్గంలో పొత్తుల వ్యవహారానికి సంబంధించి వేడి తగ్గకుండా చూడాలనే ఉద్దేశం ప్రధానంగా ఉంది. అందుకే.. ఉన్నపళంగా పొత్తులు ఇంకా పూర్తిగా కొలిక్కి రాకుండానే భారీ సభను నిర్వహించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటివి మున్ముందు మరిన్ని నిర్వహించాలనేది పార్టీల ప్లాన్గా ఉందని అంటున్నారు. ప్రజలు, మిత్రపక్షాల కార్యకర్తల మధ్య వేడి తగ్గకుండా చూసేందుకే ఈ సభలు నిర్వహిస్తున్నారని అంటున్నారు.