టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంయుక్తంగా నిర్వహించిన తాడేపల్లి గూడెం జెండా సభ సూపర్ సక్సెస్ అయింది. దీనిలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. వచ్చే ఎన్నికల్లో జెండా ఎగురుతుందని.. తాము అధికారంలోకి వస్తామని ఇరు పక్షాల నాయకులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో లొసుగులు కూడా టీకప్పులో తుఫాను మాదిరిగా సర్దుకుంటాయని అంటున్నారు. గ్రౌండ్ లెవిల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయని చెబుతున్నారు.
అయితే, ఇవన్నీ కూడా పవన్పై అభిమానంతో నాయకులు సర్దుకుపోతున్నారని. ఇది పెద్దగా చర్చకు అవసరం లేదని చెబుతున్నారు. దీనిని బట్టి ఇప్పటి వరకు సాగిన రాజకీయ క్రతువును పరిశీలించిన వారు.. జెండా ఎగరడం ఖాయమనేనని అంటున్నారు. కట్ చేస్తే.. జెండా ఎగరడం సరే. కార్యకర్తలు ఉమ్మడిగా క్షేత్రస్థాయిలో కలిసి నవడం వరకు కూడా బాగానే ఉంది. కానీ, మెజారిటీ ప్రజలు. మెజారిటీ సామాజిక వర్గాలు మాత్రం అసంతృప్తితో ఉండడం ఇప్పుడు చర్చకు వస్తున్న విషయం.
ఒక పెద్ద యుద్దానికి శ్రీకారం చుట్టామని చెబుతున్న చంద్రబాబు, పవన్.. కీలకమైన విషయాలను ప్రస్తా వించక పోవడం ఇప్పుడు చర్చగా మారింది. ఎవరైనా ఉమ్మడిగా వచ్చేప్పుడు.. ఏపీకి చేస్తామని చెప్పే అంశాలు ఉండాలి. ఏపీ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తామనే భరోసా ఇవ్వగలగాలి. ఈ కోణంలో చూసుకుంటే.. జెండా సభ ఇచ్చిన భరోసా ప్రత్యేకంగా ఏమీ లేదు. ఎప్పుడూ చెప్పే.. జగన్, వైసీపీ విముక్త రాష్ట్రాన్నే కోరుటుంటున్నట్టు దంచికొట్టారు.
కానీ, వాస్తవానికి పాలత వైసీపిపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు కొన్ని డిమాండ్లు ప్రధానంగా ఉన్నాయి. ప్రత్యేక హోదా కావొచ్చు… వెనుక బడిన జిల్లాల అభివృద్ది కావొచ్చు. లేదా.. అవినీతి, అక్రమాలు కావొచ్చు.. ఇవన్నీకాకుండా అభివృద్ది కావొచ్చు.. ఈ కోణంలో చూసుకుంటే.. ఉమ్మడిగా జెండా సభలో ఇరు పక్షాల నాయకులు వాటిని ప్రస్తావించలేదు. జగన్పై వ్యతిరేకతను పెంచడం ద్వారా మాత్రమే తాము అధికారంలోకి రావాలన్న వ్యూహాన్ని మాత్రం మరోసారి చెప్పడం కొంత ఆలోచనకు దారితీస్తోంది.