సాధారణంగా ఒకే కాన్పులో ఒకరు పుడితే వారిని పెంచి పోషించడం ఎంతో కష్టతరమవుతుంది. కానీ కొంత మందిలో ఇద్దరు ,ముగ్గురు ఒకేసారి జన్మిస్తూ ఉండడం మనం తరచూ చూస్తూ ఉంటాం. కానీ ఒకే కాన్పులో ఐదు మంది జన్మిస్తే ఎలా ఉంటుంది? వారిని పెంచటం, పోషించటం ఎంతో కష్టంతో కూడుకున్న పని. అలాంటి ఘటన కేరళలో చోటు చేసుకుంది..
నవంబర్ 18, 1995 సంవత్సరంలో కేరళ తిరువనంతపురంలోని నన్నతుకవుకి చెందిన రెమాదేవి అనే ఆవిడ ఒకే కాన్పులో ఐదు మంది పిల్లలకు జన్మనిచ్చింది. వీరిలో నలుగురు ఆడపిల్లలు కాగా, ఒక అబ్బాయి జన్మించాడు. వీరందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండి పెరిగి పెద్దవారయ్యారు. అప్పట్లో వీరి గురించి అందరూ ఎంతో ఆశ్చర్యంగా చెప్పుకున్నారు.
కేరళ క్యాలెండర్ కాలమానం ప్రకారం వీరు ఉత్రమ్ నక్షత్రం నందు జన్మించడంతో వీరికి దేవి ,ప్రేమ్ కుమార్ దంపతులు ఉత్తర, ఉత్తమ, ఉత్రా,ఉత్రజా,ఉత్రాజన్ అని తమ పిల్లలకు పేర్లు పెట్టుకున్నారు. అప్పట్లో వీరు పెరిగి పెద్దవుతున్న క్రమంలో కేరళ మీడియా వీరిని వార్తలలో చూపించింది. అయితే ప్రస్తుతం దేవి పిల్లలు మరోసారి ఇ వార్తల్లోకెక్కారు.
ఒకేసారి జన్మించిన నలుగురు అమ్మాయిలలో శనివారం ఒకేసారి ముగ్గురికి వివాహం చేయడంతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. నలుగురికి ఒకేసారి నిశ్చితార్థం కాగా కేవలం ముగ్గురు పెళ్లిళ్లు మాత్రం శనివారం జరిగాయి. ఇంకొక అమ్మాయిని చేసుకోబోయే వరుడు కువైట్ నుంచి రాలేకపోవడం వల్ల ఆమె వివాహం జరగలేదని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇలా ఒకేసారి ముగ్గురు కూతుర్లు పెళ్లి జరగడంతో ఆమె ఎంతో సంతోషించారు.
ఇంత మందిని పెంచి పోషించడం ఎంతో కష్టంగా ఉండేదని, తన భర్త ఆత్మహత్య చేసుకోవడం వల్ల తన మీద మరింత భారం పెరిగింది అని ఆమె పేర్కొన్నారు. తరువాత ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి తద్వారా తమ పిల్లలను ఎంతో కష్టపడి చదివి మంచి ఉద్యోగాలు సంపాదించారని ఆమె పేర్కొన్నారు. నలుగురు అమ్మాయిలు ఉద్యోగం చేస్తూ, వారిని చేసుకోబోయే వారు కూడా మంచి ఉద్యోగంలో స్థిరపడ్డారని, ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కొన్ని మీడియా సంస్థలు ఆమె ఆర్థికంగా సహాయం చేయడంతో పిల్లలందరికీ మంచి భవిష్యత్తును ఇవ్వగలిగిందని ఈ సందర్భంగా రెమాదేవి తెలియజేసారు.