కొద్దిసేపటి క్రితమే ప్రముఖ టాలీవుడ్ నటుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమెడియన్, విలన్ నర్సింగ్ యాదవ్ మృతి చెందారు. ఈ సంవత్సరం ఏప్రిల్ లోనే అతని ఆరోగ్య పరిస్థితి బాగోలేక వెంటిలేటర్ పైన ఉంచారు. అతనికి క్రానిక్ కిడ్నీ వ్యాధి కూడా ఉంది.
అంతేకాకుండా అతని బ్రెయిన్ లో రక్తం గడ్డ కట్టి ఉంది. తరుచూ బ్లడ్ ప్రెజర్ షుగర్ లెవెల్స్ డౌన్ అవుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు డయాలిసిస్ ట్రీట్మెంట్ చేయించుకునే నర్సింగ్ యాదవ్ ఇలా మృతిచెందడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి చెందింది.
ఏప్రిల్ నుండి కోమాలో ఉండి చికిత్స పొందుతున్న నర్సింగ్ యాదవ్ ఈరోజు తుది శ్వాస విడిచారు. 52 ఏళ్ళ వయసున్న నర్సింగ్ తెలుగు, తమిళ, కన్నడ, చిత్రాల్లో నటించారు. మొత్తంగా ఈయన 350 చిత్రాల్లో కనిపించారు. తనదైన కామెడీ టైమింగ్ తో నర్సింగ్ యాదవ్ ఎక్కువగా మెయిన్ విలన్ పక్కన ఉండే గుండెలలో ఒకడిగా… అంతేకాకుండా తనకంటూ సపరేట్ గా ఉండే కామెడీ సీన్లలో ప్రేక్షకులను మెప్పించారు అతని మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!