తనదైన స్టైల్లో సినిమాలను తెరకెక్కిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు శేఖర్ కమ్ముల. ఈయన సినిమాలంటే ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ కనబరుస్తుంటారు ప్రేక్షకులు. అటు ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పిస్తూ, వైలెన్స్ సైతం కొద్దిగా ఉండేట్టు చూసుకుంటూ లవ్ సీన్స్ ను పండిస్తూ తీసే ఈయన సినిమాలంటే జనాలకు పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంటాయి. తెలుగు ఇండస్ట్రీలో సిని దర్శకుడిగానూ అటు సినీ రచయితగానూ శేఖర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఈయన తీసిన దాదాపుగా అన్ని సినిమాలు సూపర్ హిట్ గానే నిలిచాయి. దర్శకుడిగా శేఖర్ కమ్ముల తీసిన మొదటి సినిమా డాలర్ డ్రీమ్స్. ఈ సినిమాకు ఈయనకు ఉత్తమ నూతన దర్శకుడిగా జాతీయ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఆతరువాత వచ్చిన ఆనంద్ సినిమా కూడా ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత శేఖర్ గోదావరి, హ్యాపీ డేస్, లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, అనామిక, ఫిదా సినిమాలను తీశారు.
ఈ సినిమాలు ఆయనకు ఎంతగానో పేరు తెచ్చాయనే చెప్పుకోవచ్చు. అయితే ఆయనకు ఎన్నో పురస్కారాలు వరించాయి. ఎన్నో అవార్డులను శేఖర్ సొంతం చేసుకున్నారు. కాగా ప్రస్తుతం శేఖర్ కమ్ముల మరొక కొత్త లవ్ స్టోరీతో సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ మూవీ పేరు ‘లవ్ స్టోరీ’. ఈ రియలిస్టిక్ లవ్ కథలో అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా, సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్నారు.
అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక పాట చిత్రీకరణతో తాజాగా షూషింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్బంగా దర్శకుడు శేఖర్ కమ్ముల, హీరోయిన్ సాయిపల్లవి, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తదితరులు కలిసి ఫోటో తీసుకున్నారు. ఈ పాట చిత్రికరణ నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో షూట్ చేయడం జరిగింది. ఈ పాటతో లవ్ స్టోరీ సినిమా కంప్లీట్ అయ్యింది. ఇక బాక్సాపీస్ లు తెరచుకోగానే ఆడియెన్స్ ను అలరించడానికి ఈ మూవీ సిద్దమైంది.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!