Corona Vaccine : దేశంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా గానీ వేయించుకోవడానికి జనాలు ముందుకు రావటం లేదు.
ఫ్రంట్ లైన్ లో ఉన్న ఆరోగ్య సిబ్బంది కి కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత వస్తున్న ఫలితాలు చాలా మందిని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది. కొంతమందికి ఇన్ఫెక్షన్ మరికొంతమందికి బ్రెయిన్ డెడ్ అయిన సందర్భాలు.. వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత కనపడటం తో జనాలలో కరోనా వ్యాక్సిన్ పై నెగిటివ్ అభిప్రాయం నెలకొంది. ఇలా ఉంటే తాజాగా ఇటీవల గుజరాత్ రాష్ట్రంలో వడోదరాలో ఆదివారం కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకున్న 30 సంవత్సరాల పారిశుద్ధ్య కార్మికుడు రెండు గంటలకే మృతి చెందటం సంచలనం అయ్యింది. దీంతో మృతుడి కుటుంబీకులు వ్యాక్సింగ్ తీసుకున్న తర్వాత ఆయన మరణించడం జరిగింది అంతకు ముందు ఆరోగ్యంగా ఉండేవాడని ఆరోపిస్తూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో అతని మృతికి గల కారణం కోసం అధికారులు పోస్టుమార్టం కి ఆదేశాలు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. చాలావరకు ఆతడు గుండెపోటు వల్ల మరణించినట్లు చెబుతుండగా మరోపక్క మాత్రం 30 సంవత్సరాల వయసున్న కుర్రవాడు అది చలాకీగా ఉండే వ్యక్తికి గుండె పోటు ఎందుకు వస్తుంది అని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే సదరు వ్యక్తి కరోనా టీకా సెంటర్ లో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వైద్య పర్యవేక్షణలో అరగంటపాటు ఉన్నట్లు, ఆ సమయంలో ఎటువంటి దుష్ప్రభావాలు కనిపించలేదని అటువంటి వ్యక్తి మరణించడం ఏంటి అన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉంటే అతడి ఆరోగ్యం గురించి ఆరా తీస్తే ఏడాదిన్నర క్రితం ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో గుండె కు సంబంధించి వ్యాధి నిమిత్తం చెకప్ జరిగినట్లు గుర్తించారు. ఇటువంటి నేపథ్యంలో పోస్టుమార్టం రిపోర్ట్ లో ఏం వస్తుంది అన్న దానిపై అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.