ఢిల్లీ : భారత నావికాదళ కొత్త చీఫ్గా విశాఖపట్నంలోని ఈస్ట్రన్ నావల్ కమాండ్లో ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా పనిచేస్తున్న కరంబీర్ సింగ్ నియమితులయ్యారు.
ప్రస్తుతం నేవీ చీఫ్గా వ్యవహరిస్తున్న సునీల్ లాంబా పదవీ విరమణ చేయనున్నారు.
లాంబా స్థానంలో పదోన్నతిపై కరంబీర్ బాధ్యతలు చేపడతారు.
ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేసింది.
1980లో ఇండియన్ నేవీలో ప్రవేశించిన కరంబీర్ 1982లో హెలికాప్టర్ పైలట్గా పదోన్నతి అందుకున్నారు. తన సుదీర్ఘ కెరీర్లో ఆయన అనేక నేవీ కేంద్రాల్లో పనిచేసి వైస్ అడ్మిరల్గా ఎదిగారు.