భారత్ గణతంత్ర దేశం. ప్రపంచంలో అతి పెద్ద సమాఖ్య ప్రజాస్వామ్య వ్యవస్థ. భారత్ లాంటి ఫెడరల్ రూపానికి ప్రజాసామ్యం అయివు. అలాంటి ప్రజాసామ్యన్ని సమర్థతవతంగా సాగడం కోసం ఆ బాధ్యతను రాజ్యాంగం రాజకీయ వ్వవస్ధ అప్పగించింది. అలా ప్రజలను ఫలించే ప్రజా ప్రతినిధిలను ఎన్నికల ద్వారా ఎన్నుకుంటాం. ఎన్నికల్లో ఓ ప్రజాప్రతినిధిగా ఎన్నికవడానికి అనేక పక్రియల్లో ఉంటాయి. మొదటిగా నామినేషన్, తర్వాత ఎన్నికలు. అనంతరం పదవి. ఇది ప్రస్తుత ఎన్నికల భారతంలో జరుగుతున్న పక్రియ.
అయితే ఎన్నికల సమయంలో ఎక్కువగా నాయకులు నోట నుంచి వినే పదం పత్యర్థి డిపాజిట్ కూడా గల్లంతు చేస్తా! అని అయితే అసలు ఈ డిపాజిట్ అంటే ఏమిటో?.. ఒకసారి పరిశీలిద్దాం. ఎన్నికల్లో అభ్యర్థి నామినేషన్ వేయాలంటే కొంత మొత్తం చెల్లించాలి. దీన్ని ధరావతు లేదా డిపాజిట్ అంటారు. పార్లమెంట్ పోటీ చేసేవారు రూ.25వేలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలైతే సగం అంటే రూ.12,500 చెల్లిస్తే సరిపోతుంది.పోటీ చేయాలంటే రూ.10వేలు కట్టాలి. ఎస్సీ, ఎస్టీలు 5 వేలు చెల్లిస్తే చాలు.
అభ్యర్థికి డిపాజిట్ దక్కాలంటే..మెుత్తంగా పోలైన ఓట్లలో కనీసం 1/6 ఓట్లుపోటీ చేసిన అభ్యర్థికి పోల్ అవ్వాలి. అలా ఓట్లు రాని పక్షంలో సదరు అభ్యర్థి డిపాజిట్ గల్లంతు అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో అతని నామెషన్కు చెల్లించిన రుసుమును తిరిగి తిరిగి వెనక్కి ఇవ్వరు. దాన్ని ధరావతు జప్తు చేయడం అంటారు. ఈ విదానాన్ని తీసుకరావడానికి కారణం సరదాగా పోటీ చేసే వారికి అడ్డుకట్ట వేయడం కోసం. 1951నాటి ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 34(1)(ఎ) నిబంధన ప్రకారం డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. 1996లో డిపాజిట్ చాలా తక్కువ మెుత్తంలో ఉండేది. ఎస్సీ, ఎస్టీలకైతే రూ.250, ఇతరులకైతే రూ.500 మాత్రమే ఉండేది.