డిసెంబర్ 9న కొణిదెల నిహారిక మరియు జొన్నలగడ్డ వెంకట చైతన్యల పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసిన సంగతి విదితమే. గత నెలలో చైతన్య తండ్రి ఐజీ ప్రభాకర్ రావు తిరుమల దర్శనానికి వెళ్ళి అక్కడ లగ్న పత్రికకు పూజ చేయించారు. పూజ చేయించిన తరువాతే పెళ్లికి సంబంధించిన వివారాలన్నీ మీడియాకి విడుదల చేశారు.
మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైనందున మెగా బ్రదర్స్ ఫుల్ బిజీ గా ఉన్నారు. ఇంకా నిహారిక పెళ్లికి మరో మూడు రోజులు మాత్రమే ఉండడం వల్ల పెళ్లి పనులను ముమ్మరం చేశారు. మెగా ఫామిలీ మెంబెర్స్ అందరూ ఇప్పటికే రాజస్థాన్లో పెళ్లి వేడుక జరగనున్న ఉదయపూర్ ప్యాలెస్కు చేరుకున్నారు. పెళ్లి పనులు దాదాపుగా అయిపోయాయి.
నిన్న కార్తీక బహుళ పంచమి శుభ దినంగా అయినందున మెగా కుటుంబ సభ్యులు పెళ్ళిలో మొదటి తంతు అయిన మంగళ స్నానాలు నిహారికకు చేయించి పెళ్లి కూతురుని చేసారు. చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ తప్ప మిగిలిన మెగా కుటుంబ సభ్యులందురు ఇప్పటికే ఉదయపూర్ చేరారు.
ప్రస్తుతం చిరంజీవికి ఈరోజు ‘ఆచార్య’ షూటింగ్ ఉన్నందున ఆయన ఇంకా వెళ్ళలేదు. ఈ రోజు షూటింగ్ పూర్తయిన వెంటనే చిరు డైరెక్ట్గా ఉదయపూర్ కు వెళ్లనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు లేదా రేపు ఉదయం ఉదయ్పూర్ కు వెళ్లి మూడు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. ఇక రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ విషయానికి వస్తే వారు కూడా తమ షూటింగ్ చూసుకుని సోమవారం ఉదయనికి ఉదయ్ పూర్ తమ కుటుంబ సభ్యలతో సహా చేరుకోనున్నారు.