Yash : కేజీఎఫ్ సినిమా తో పాన్ ఇండియా హీరో గా మారిపోయిన యశ్ కు అభిమానులు భారీగా పెరిగిపోయారు.. తాజగా కేజీఎఫ్ హీరో యశ్ అభిమాని ఆత్మహత్య చేసుకున్న సంగతి సంచలనం సృష్టించింది.. తన సూసైడ్ నోట్ లో యశ్ కు వీరాభిమానిన్న యువకుడు.. ఆఖరి కోరిక తీర్చమని యశ్ ను రిక్వెస్ట్ చేసాడు..
కర్ణాటక మాండ్య జిల్లాలోని కొడిధోడ్డి గ్రామానికి చెందిన 25 సంవత్సరాల రామకృష్ణ ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. తాను నిజ జీవితంలో ఫెయిల్ అయ్యానని .. తన తల్లికి మంచి కొడుకుని కాలేకపోయనని.. తన అన్నయ్య కి మంచి తమ్ముడిని కాలేకపోయనని.. చివరికి ప్రేమలో కూడా గెలవలేక పోయానని.. ఇక నిజ జీవితంలో సాధించటానికి ఏమి లేదని..అంటూ రామకృష్ణ రాసిన లేఖ అందరినీ కంటతడి పెట్టించింది.. ఇంకా ఈ లేఖలో తను హీరో యశ్ , కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధారామయ్య అభిమానినని తన అంత్యక్రియలకు రావాలని లేఖలో పేర్కొన్నాడు..
ಅಭಿಮಾನಿಗಳ ಅಭಿಮಾನವೇ ನಮ್ಮ ಬದುಕು.. ಜೀವನ.. ಹೆಮ್ಮೆ..
ಆದರೆ ಮಂಡ್ಯದ ರಾಮಕೃಷ್ಣನ ಅಭಿಮಾನಕ್ಕೆ ಹೆಮ್ಮೆಪಡಲು ಸಾಧ್ಯವೇ…
ಅಭಿಮಾನಿಗಳ ಅಭಿಮಾನಕ್ಕೆ ಇದು ಮಾದರಿಯಾಗದಿರಲಿ.. ಕೋಡಿ ದೊಡ್ಡಿ ರಾಮಕೃಷ್ಣನ ಆತ್ಮಕ್ಕೆ ಚಿರಶಾಂತಿ ಸಿಗಲಿ…
ಓಂ ಶಾಂತಿ…— Yash (@TheNameIsYash) February 18, 2021
ఈ విషయం తెలుసుకున్న సిద్ధారామయ్య అంత్యక్రియల్లో పాల్గొన్నారు. యువత ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని అన్నారు. ఈ విషయం తెలుసుకున్న హీరో యశ్ .. ట్విట్టర్ లో దీని పై స్పందించారు. అభిమానుల అభిమానమే మాకు బలం, రామకృష్ణ అభిమానం వెలకట్టలేనిది.. అయితే తాము అభిమానుల నుంచి ఆశించేది ఇది కాదని, ఈలలు, చప్పట్లు మాత్రమే తాము కోరుకుంటామని ఎమోషనల్ గా పోస్ట్ చేశాడు.. అభిమాని మృతికి సంతాపం తెలిపాడు.
ಮಂಡ್ಯ ತಾಲೂಕಿನ ಕೋಡಿದೊಡ್ಡಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ಆತ್ನಹತ್ಯೆಗೆ ಶರಣಾದ ಕೃಷ್ಣ ಎಂಬ ಯುವಕನ ಅಂತ್ಯಕ್ರಿಯೆಯಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿದೆ.
ಆತ್ಮಹತ್ಯೆಗೂ ಮುನ್ನ ಹುಡುಗ ತನ್ನ ಅಂತ್ಯಕ್ರಿಯೆಗೆ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಬರಬೇಕು ಅಂತ ಬರೆದಿಟ್ಟಿದ್ದ, ಆ ಕಾರಣ ಅತ್ಯಂತ ದುಃಖದಿಂದ ಆತನ ಕೊನೆ ಆಸೆ ಈಡೇರಿಸಿದ್ದೇನೆ. 1/5 pic.twitter.com/5CkznIfy27— Siddaramaiah (@siddaramaiah) February 18, 2021