ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం అవనిగడ్డపై వైసీపీ అంతులేని రాజకీయం చేస్తోందని ఆ పార్టీ నాయకులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సింహాద్రి రమేష్ బాబు గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా గెలుపొందారు. ఈ సారి ఆయనను సీఎం జగన్ మార్చాలనుకున్నారు. ఇటీవల కసరత్తులో భాగంగా ఆయనను మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా నియమించారు. సింహాద్రి చంద్రశేఖర్ అనే వైద్యుడ్ని అవనిగడ్డ సమన్వయకర్తగా ప్రకటించారు. అయితే ఈ మార్పులపై ఇద్దరూ అసంతృప్తితో ఉన్నారు. ఈ కారణంగా అవనిగడ్డతో పాటు మచిలీపట్నం పార్లమెంట్ స్థానంలో ఎన్నికల ప్రచారం ప్రారంభం కాలేదు.
తాజాగా వైసీపీవిడుదల చేసిన పదో జాబితాలో అవినిగడ్డ సమన్వయకర్తగా మళ్లీ సింహాద్రి రమేష్ ను నియమించారు. సింహాద్రి చంద్రశేఖర్ను మచిలీపట్నం ఎంపీగా పంపించారు. తాను ఎంతో కాలం నుంచి అవనిగడ్డ ప్రజలకు సాయం చేయాలనే ఆలోచన లో ఉన్నట్లు సింహాద్రి చంద్రశేఖర్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన కుమారునికి సీటు ఖరారు చేయించుకున్నారు. ఇప్పుడు అన్నీ మారాయి. చంద్రశేఖరే మచిలీపట్నం ఎంపీగా ఖరారయ్యారు.
ఇక, అధికార వైసీపీలో ఇన్చార్జ్లు నియామకం, మార్పులు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. సింహాద్రి చంద్రశేఖర్రావును ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేసిన తర్వాత ఆయన సైలెంట్గా ఉన్నారు.
పార్టీ కార్యక్రమాల్లోనూ ఆశించిన స్థాయిలో పాల్గొనలేదు. తర్వాత తనకు వయసు సహకరించదని.. తన కుమారుడు రామ్ చరణ్ కు ఇన్చార్జ్ బాధ్యతలను అప్పగించాలని ఆయన కోరారు. సీఎం కలిసి వచ్చిన తరువాత నేరుగా డాక్టర్ చంధ్రశేఖర్.. నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలను తన కుమారుడికి అప్పగిస్తున్నట్టు ప్రకటించారు.
అవనిగడ్డ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా నన్ను నియమించినందుకు సీఎం జగన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. కానీ, నా వయసు రీత్యా నా కుమారుడైన సింహాద్రి రామ్చరణ్కు నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఇక నుంచి రామ్ చరణ్ అవనిగడ్డ వైసీపీ ఇన్చార్జ్గా ప్రతి గడపకు తిరుగుతాడ`ని ప్రకటించారు కానీ మళ్లీ మారిపోయింది. సింహాద్రి రమేష్ ను మళ్లీ అసెంబ్లీ సమన్వయకర్తగా నియమించినా వైసీపీ హైకమాండ్ వేరే ఆలోచనల్లో ఉందని తెలుస్తోంది. ఈ స్థానం పొత్తుల్లో భాగంగా జనసేనకు వెళ్తోంది.
టీడీపీ తరపున ఇక్కడ సీనియర్ నేత మండలి బుద్ధ ప్రసాద్ బరిలోకి దిగాల్సి ఉంది. కానీ జనసేనకు వెళ్లడంతో అసంతృప్తికి గురయ్యారు. ఆయనతో వైసీపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. పొత్తలపై అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత మండలి బుద్దప్రసాద్ కూడా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే సింహాద్రి రమేష్ కు హ్యాండిచ్చి.. బుద్ద ప్రసాద్ ను అభ్యర్థిగా ఖ౮రారు చేసే అవకాశం ఉంది. అందుకే అవనిగడ్డపై వైసీపీ అంతులేని రాజకీయం చేస్తొందన్న విమర్శలు వస్తున్నాయి.