అమరావతి: రాజధాని అమరావతిపై అధికార పార్టీ నేతలు ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్న నేపథ్యంలో రాజధాని ప్రాంత రైతుల్లో ఆయోమయం, ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో వైసిపి పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ (పివిపి) విభిన్నంగా స్పందించారు.
‘భ్రమరావతులు, బాహుబలులు చూసేసాము, మనకి కావాల్సింది మణులు, మాన్యాలు, మాహిష్మతి కాదు..మన బిడ్డలకు విద్య, అయ్యలకు వైద్యం, అమ్మలకు పింఛను, తినడానికి తిండి లేనప్పుడు మీసాలకు సంపంగె నూనె ఎవడైనా రాస్తాడా? అంటూ పివిపి ప్రశ్నించారు.
రాజధాని నిర్మాణం కంటే ప్రాధాన్యమైన అంశాలపై ముందుగా దృష్టి సారించాలన్నది పివిపి అభిప్రాయంగా ఈ ట్వీట్ బట్టి తెలుస్తున్నది. పివిపి ట్వీట్పై అప్పుడే విమర్శలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రానికి క్యాపిటల్ వద్దు అని చెప్పడానికి ఆయనెవరు అంటూ మండిపడుతున్నారు.
భ్రమరావతులు, బాహుబలులు చూసేసాము! మనకి కావాల్సింది మణులు, మాన్యాలు, మాహిస్మతి కాదు.. మన బిడ్డలకు విద్య, అయ్యలకు వైద్యం, అమ్మలకు పింఛను.
తినడానికి తిండి లేనప్పుడు, మీసాలకు సంపంగె నూనె ఎవడైనా రాస్తాడా? జై ఆంధ్రా..— PVP (@PrasadVPotluri) August 27, 2019