ఎంటెక్ చదువుకున్న ఆ మహిళ వైసిపి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.అలాగని చదువుపై ఆమె తన జిజ్ఞాసను పక్కన పెట్టలేదు.అదే ఇప్పుడు ఆ మహిళా ఎమ్మెల్యేను దేశంలో టాప్ గా నిలబెట్టింది.
ఆమె చేసిన ఒక ఆవిష్కరణకు జాతీయ స్థాయిలో రెండో అవార్డు లభించింది.అనంతపురం జిల్లాకు చెందిన వైసిపి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఈ ఘనతను సొంతం చేసుకుంది.
కోవిడ్–19 పరీక్ష చికిత్స విషయంలో నూతన ఆవిష్కరణలపై జాతీయ పరిశోధన అభివృద్ధి సంస్థ (ఎన్ఆర్డీసీ)ఇటీవల పోటీలు నిర్వహించింది. ఈ పోటీలకు వెళ్లిన ప్రాజెక్టుల్లో ఏపీ నుంచి రెండు ఆవిష్కరణలకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది.కరోనా మహమ్మారితో పోరాడుతున్న వైద్య సిబ్బందికి ఆ వైరస్ సోకకుండా ఉండే క్యాబిన్ ను ఎంటెక్ చదివిన ఎమ్మెల్యే పద్మావతి రూపొందించారు. ఆ క్యాబిన్ అందర్నీ ఆకర్షించింది.
ఆ క్యాబిన్లో వైరస్ చొరబడటానికి అవకాశం లేకుండా తయారు చేశారు. పీపీఈ కిట్లు లేకుండా డాక్టర్లు క్యాబిన్లోకి ప్రవేశించిన తర్వాత సురక్షితంగా ఉంటారు. ఈ క్యాబిన్ నుంచే వారు వైరస్ రోగులకు సేవలు అందించొచ్చు. వార్డుల్లో క్యాబిన్తో పాటు స్వేచ్ఛగా తిరగవచ్చేలా ఆ క్యాబిన్ ను సిద్ధం చేశారు. వైద్యుడు క్యాబిన్ నుంచి బయటకు వచ్చాక అది ఆటోమేటిగ్గా శానిటైజ్ అవడం దీని ప్రత్యేకత. ఈ ఆవిష్కరణకే జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది.అనంతపురంలోని ఎస్ఆర్ఐటీ, ఏలూరులోని రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఈ ఘనత సాధించాయి. ఎస్ఆర్ఐటీ ఆవిష్కరణ పద్మావతి ఆధ్వర్యంలో రూపొందించారు. ఓ ఎమ్మెల్యే ఇలాంటి ఆవిష్కరణ చేయడం దేశ చరిత్రలోనే మొట్టమొదటిది. దేశ వ్యాప్తంగా జరిగిన పోటీకి వేలాది దరఖాస్తులు రాగా 16 ఆవిష్కరణలు చేసిన వారు విజేతలుగా నిలిచారు. త్వరలోనే వారికి బహుమతులు అందజేయనున్నారు. ఎమ్మెల్యే పద్మావతికి అవార్డు రావడంతో మంత్రులు.. ఎమ్మెల్యేలు.. పార్టీ నాయకులు అభినందిస్తున్నారు.విద్యావంతులకు టిక్కెట్ లిచ్చిన వైసిపి అధినేత ముఖ్యమంత్రి జగన్ కి కూడా ఈ విజయంలో లో భాగం ఉంది.