NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ లు దాఖలు చేసిన వైసీపీ అభ్యర్ధులు

YSRCP: ఈ నెల 27వ తేదీన జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు వైసీపీ అభ్యర్ధులు నామినేషన్ లు వేశారు. ఈ రోజు అసెంబ్లీ కార్యదర్శికి వైసీపీ అభ్యర్ధులుగా వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ రెడ్డి, గొల్ల బాబూరావులు తమ నామినేషన్ పత్రాలు సమర్పించారు.

YSRCP Members have filed nominations for the Rajya Sabha Elections
YSRCP Members have filed nominations for the Rajya Sabha Elections

సోమవారం అసెంబ్లీ లో రాజ్యసభ ఎంపీ అభ్యర్ధుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయిన సంయుక్త కార్యదర్శి యం విజయరాజు వద్ద వారి నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ అభ్యర్ధుల వెంట రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, గడికోట శ్రీకాంత్ రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ నెల 15వ తేదీతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. తొలుత వైసీపీ రాజ్యసభ అభ్యర్ధులు వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబూరావులు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిశారు. వీరికి సీఎం జగన్ బీఫాం లు అందజేశారు.

ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వైసీపీలో అధిక ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. రాజ్యసభ ఎన్నికల్లో సీఎం జగన్ సామాజిక న్యాయం చేశారని కొనియాడారు. గతంలో బీసీలకు నలుగురికి రాజ్యసభ అవకాశం కల్పించగా, తాజాగా దళితుడైన గొల్ల బాబూరావుకు అవకాశం ఇచ్చినట్లు తెలిపారు.

శాసనసభలో అత్యధిక బలం తమకే ఉందని, వైసీపీ నుండి ముగ్గురు అభ్యర్ధులం విజయం సాధిస్తామని వైవీ అన్నారు. సీఎం జగన్ పాలనను ప్రజలు కోరుకుంటున్నారనీ, మళ్లీ వైఎస్ జగన్ ను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మరో అభ్యర్ధి మేడా రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ తనకు అవకాశం కల్పించారనీ, జగన్ ఆశయాలు, రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేస్తానని పేర్కొన్నారు.

గొల్ల బాబూరావు మాట్లాడుతూ..జగన్ చరిత్ర సృష్టించారని అన్నారు. పేద వర్గాల వారికి రాజ్యసభకి పంపిస్తున్నారన్నారు. కొట్లు ఇచ్చిన దొరకని రాజ్యసభ స్థానాన్ని దళితుడైన తనకు ఇచ్చారన అన్నారు. గతంలో చంద్రబాబు తన కులానికి చెందిన కనకమేడల కోసం దళితుడైన వర్ల రామయ్యను అవమానించారని విమర్శించారు. సంఖ్యాబలం ప్రకారం మూడు స్థానాలు తామే దక్కించుకుంటామని తెలిపారు.

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్ స్పీచ్ హైలెట్

Related posts

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju