(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
ఏపి బిజెపి అధ్యక్షుడుగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఆయన తరహా మార్పులు, చేర్పులు చేసుకుంటూ వస్తున్నారు. కాదన్న వారిపై కత్తివేటు వేస్తున్నారు. అవునన్నవారిపై ఆకులో భోజనం పెడుతున్నారు. మొత్తానికి ఏపి బిజెపిలో తన హావా పూర్తిగా చాటుతున్నారు. ఈ క్రమంలోనే ఏపి బిజెపిలో పతాధికారారులను, కార్యవర్గాలను పూర్తిగా మార్చి పారేశారు. ఏపి బిజెపిని ప్రక్షాళన చేసే క్రమంలో అనేక పదవులను కొత్త వాళ్ళను తీసుకువచ్చ అందలం ఎక్కించారు. ఒక నిర్దేశిత లక్ష్యంతో 2024 ఎన్నికల నాటికి తాము అనుకున్న ప్రణాళిక ప్రకారం పార్టీ నడవాలి అంటే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారిగా పార్టీ క్షేత్ర స్థాయిలో బలోపేతం అవ్వాలని అనుకుంటున్న బిజెపి ఈ పదాధికారుల మార్పుతో స్పష్టమైన సంకేతాలు ఇస్తుంది. అయితే క్షేత్ర స్థాయిలో జరిగిన కొన్ని మార్పులు ఆశ్చర్యాన్ని కల్గిస్తున్నాయి.
ఎవరెవరు ఏ పదవులంటే…
స్టేట్ వైస్ ప్రెసిడెంట్ లు..రేలంగి శ్రీదేవి, కాకు విజయలక్ష్మి, మాలతి రాణి, నిమ్మక జయరాజు, పైడి వేణుగోపాల్, విష్ణుకుమార్ రాజు, ఆదినారాయణరెడ్డి, రావెళ్ల కిషోర్ బాబు, పి సురేందర్ రేడ్డి, చంద్రమౌళి, స్టేట్ జనలర్ సెక్రటరీలు..పివిఎన్ మాధవ్, విష్ణువర్థన్ రెడ్డి, లోకుల గాంధీ, సూర్యనారాయణరాజు, ఎన్ మధుకర్, పాతూరి నాగభూషణం, కే నీలకంఠ, బి శ్రీనివాస వర్మ, ఎన్ రమేష్ నాయుడు, ఎం సుధాకర్ యాదవ్, ట్రెజర్ మరియు హెడ్ ఆఫీస్ ఇన్ చార్జి.. సత్యమూర్తి, స్టేట్ ఆఫీస్ సెక్రటరీ పి శ్రీనివాస్, స్టేట్ మోర్చా ప్రెసిడెంట్స్ ..సురేంద్ర మోహన్ (యువమోర్చా), నిర్మల కిషోర్ (మహిళా మోర్చా), షశిబూషన్ రెడ్డి (కిసాన్ మోర్చా), జి దేవానంద్ (ఎస్ సి మోర్చా), బిట్ర శివనారాయణ (ఒబిసి మోర్చా), కే ఉమామహేశ్వరరావు (ఎస్ టి మోర్చా), ఎస్ కె బాజీ (మైనార్టీ మోర్చా), అధికార ప్రతినిధులుగా పుడి తిరుపతిరావు, సుహాశిని ఆనంద్, చందు సాంభశివరావు, కె ఆంజనేయరెడ్డి, సామంచి శ్రీనివాస్, భాను ప్రకాష్ రెడ్డిలు నియమితులైయ్యారు.