అమరావతి: ప్రజలపై భారం మోపుతున్న జగన్ ప్రభుత్వానికి ఆర్టిసి చార్జీలు పెంచితే చెడ్డపేరు రావడం ఖాయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ఆర్టిసి చార్జీల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నష్టాల సాకుతో ఆర్టిసి బస్సు చార్జీలను పల్లె వెలుగుకు కిలోమీటర్కు 10 పైసలు, ఇతర సర్వీసులకు 20 పైసలు పెంచటం సరికాదని అన్నారు.
ప్రజా రవాణా వ్యవస్థను లాభనష్టాలతో బేరీజు వేయడం సరికాదని రామకృష్ణ పేర్కొన్నారు. ఇప్పటికే ఉల్లి ధర ఎన్నడూ లేనంతగా కిలో 150 రూపయలకు పైగా పెరిగిందన్నారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు.