రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం చాలా గ్యాప్ తీసుకొచ్చింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వివాదానికి ముందు కేసీఆర్, జగన్ ఇద్దరు ప్రాణ స్నేహితులుగా మెలిగారు. ఎప్పుడైతే రాయలసీమ ఎత్తిపోతల పథకం కాన్సెప్టు తెరపైకి వచ్చిందో తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వాన్ని ఏకీ పారేస్తుంది. విభజన చట్టానికి వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది అంటూ తెలంగాణ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది.
ఈ వివాదం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ డీల్ చేయటానికి అక్టోబర్ ఆరో తారీకు అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వం ఇంకోసారి అనవసరమైన ప్రాజెక్టులు కట్టకుండా తెలంగాణ ప్రభుత్వానికి అడ్డురాకుండా దీటైన జవాబు చెప్పాలని కెసిఆర్ ఇప్పటికే నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశం అవుతున్నారు.
పరిస్థితి ఇలా ఉండగా తెలంగాణ ఆర్టీసీ పై అంతరాష్ట్ర బస్సు రవాణా కి సంబంధించి రాకపోకలపై ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు ఎప్పుడు నడుస్తాయో తెలంగాణ సీఎం కేసీఆర్ నే అడగాలి అని పేర్కొన్నారు. నీటి వివాదాలకు రవాణా రాకపోకలకు సంబంధం ఉండదని ఏపీకి ఎలాంటి షరతులు విధించారో మిగతా రాష్ట్రాలకు కూడా అవే షరతులు తెలంగాణ ప్రభుత్వం విధించిందని పేర్ని నాని పేర్కొన్నారు.