తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మంచి దూకుడు మీద రాజకీయాలు చేస్తున్న క్యాడర్ నుండి సరైన సపోర్ట్ రావడంలేదని వార్తలు వస్తున్నాయి. సరిగ్గా మార్చి 15వ తారీఖున తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా బీజేపీ అధిష్టానం ప్రకటించిన తర్వాత కరోనా లాక్ డౌన్ ఎఫెక్టుతో అడపాదడపా కార్యక్రమాలు చేపట్టడంతో పూర్తిగా అధ్యక్షుడుగా బండి సంజయ్ క్యాడర్ కి అలవాటుపడ్డ లేకపోయారు. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం అధికార పార్టీపై ఎలాంటి విమర్శలు వచ్చినా దాన్ని టార్గెట్ చేస్తూ మరింత ఇరుకున పెట్టే విధంగా బండి సంజయ్ అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాట్లు టాక్.
ఈ నేపథ్యంలో ఇటీవల సీఎం కేసీఆర్ వర్సెస్ తెలంగాణ గవర్నర్ అన్నట్టుగా పరిస్థితి ఉన్నట్లు వార్తలు రావడంతో ఆ విషయంపై బండి సంజయ్ స్పందించారు. వర్చువల్ సభలో పాల్గొన్న టైంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పై గవర్నర్ తమిళసై అసంతృఫ్తిగా ఉన్నారని షాకింగ్ కామెంట్లు చేశారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కూడా తీవ్ర అసంతృప్తి ఏర్పడిందని అందువల్లే రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం లేక కరోనా విషయంలో కాపాడాలని గవర్నర్ ని సంప్రదిస్తున్నరు అని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ప్రభుత్వ అధికారులు గవర్నర్ కి భయపడుతున్నారని, ఆ విధంగా పరిపాలన ఉందని చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం కేసీఆర్ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని విమర్శలు చేశారు.