దుబ్బాక ఉప ఎన్నికలను తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ఎన్నికలలో ఎలాగైనా సత్తా చాటాలని ఒకపక్క విపక్షాలు ఎవరికి వారు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో దుబ్బాక ఉప ఎన్నికల ప్రచార బాధ్యతలు మొత్తం సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావు భుజంపై వేయటం జరిగింది. టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సోలిపేట రామచంద్రారెడ్డి హఠాత్మరణం తో వచ్చిన ఈ ఉపఎన్నిక టికెట్ ఆ కుటుంబానికి చెందిన వారికే టిఆర్ఎస్ పార్టీ ఇవ్వనుంది.
అయితే ఎన్నికల్లో సత్తా చాటాలని కరోనా వైరస్ కంట్రోల్ విషయంలో విపక్షాల నుండి తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో…. ఈ ఎన్నికలలో గెలిచి వచ్చిన విమర్శలకు పూర్తిగా చెక్ పెట్టాలని కేసిఆర్ ఫుల్ పవర్స్ హరీష్ రావు ఇచ్చారట. ఏం చేస్తావో నాకు తెలియదు దుబ్బాక ఎన్నికలలో మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ జండా ఎగరాలని చెప్పి… హరీష్ రావును ఇన్చార్జిగా నియమించడం జరిగిందట.
దీంతో ప్రస్తుతం నియోజకవర్గంలో గ్రామాల వారీగా హరీష్ రావు ఇన్చార్జిల నియమించి ఒక్కో గ్రామానికి వారికి బాధ్యతలు అప్పగించి… ఉప ఎన్నికలలో పార్టీ గెలిచే రీతిలో ఓటర్లు ఆకట్టుకోవడం కోసం రెడీ అవుతున్నారట. గ్రామాలలో ఉన్న సమస్యలను ఈ నేపథ్యంలో తెలుసుకుని గెలిచిన మూడు నెలలలోపే పరిష్కరిస్తామని స్వయంగా హరీష్ రావు దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నారట.
అంతేకాకుండా ఈ నియోజకవర్గాన్ని మరో సిద్దిపేట చేస్తాను అంటూ హామీ ఇస్తున్నారట. ఉప ఎన్నికలలో పార్టీకి మంచి మెజారిటీ తీసుకురండి… నియోజకవర్గం దిశ, దశ మార్చేస్తానని హరీష్ స్వయంగా క్యాడర్ కి చెప్పటంతో వాళ్లల్లో సంతోషం నెలకొందట. ఏది ఏమైనా ఈ దుబ్బాక ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీ తీసుకురావడానికి కేసిఆర్ హరీష్ కి పూర్తి స్వేచ్ఛను ఇవ్వటంతో నియోజకవర్గంలో భారీ హామీలు ఇస్తున్నట్లు సమాచారం.