దాదాపు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని ఓడించి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు వైయస్ జగన్. 2019 ఎన్నికలలో వైఎస్ జగన్ సృష్టించిన ప్రభంజనానికి ఒక్క ఏపీ మాత్రమే కాక ఢిల్లీ స్థాయి నేతలంతా ఆశ్చర్యపోయారు. జగన్ విజయం సాధించిన తర్వాత మొట్టమొదటిసారి మోడీని కలిసిన సమయంలో చాలా ఆప్యాయంగా జగన్ ని కౌగిలించుకుని దాదాపు గంటన్నర కి పైగా ఏకాంతంగా మాట్లాడటం అప్పట్లోనే సంచలనం సృష్టించింది. ఆ తర్వాత దేశంలో ప్రముఖ పత్రికలు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు పనితీరు గురించి చేసిన ఇప్పటివరకు సర్వేలలో వైయస్ జగన్ ఆల్మోస్ట్ టాప్ స్థానంలోనే నిలుస్తూ వచ్చారు.
కరోనా వైరస్ కట్టడి చేయడంలో ఇంకా ప్రజలకు ప్రభుత్వ పథకాలు సరైన టైంలో అందించడంలో చాలా వరకూ సక్సెస్ అయ్యారు అని ఇప్పటికే జాతీయ స్థాయిలో ఉన్న నేతలు సైతం ఒప్పుకుంటున్నారు. ఇదిలా ఉండగా ప్రతి ఇంటికి వైద్యం అందేలా జగన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు నేషనల్ స్థాయి రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నట్లు జాతీయ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి ఇంటి సభ్యుడి ఆరోగ్య వివరాలు ఆధారంగా వైద్యం అందేలా జగన్ శ్రద్ధ వహించడం నిజంగా శుభపరిణామమని ఢిల్లీ స్థాయి నేతలు అంటున్నారట.
ఇదే సమయంలో ప్రభుత్వ పథకాలు ప్రతి లబ్ధిదారులకు అందేలా జగన్ వ్యవహరిస్తూ ఎక్కడ కూడా తారతమ్య బేధాలు లేకుండా చూసుకుంటున్నారు. దీంతో ఏపీ లో జరుగుతున్న అంతా తెలుసుకుని ఇలా అయితే జగన్ దక్షిణ భారతదేశంలో బలమైన రాజకీయ శక్తిగా మారతారని ఢిల్లీ స్థాయి నేతలు తెగ డిస్కషన్లు చేసుకుంటున్నారట. ఏది ఏమైనా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే కేంద్రంలో వైయస్ జగన్ కి ప్రాధాన్యత పెరుగుతూనే మరోపక్క నేషనల్ లెవెల్ లో ఉన్న రాజకీయ నాయకులను సైతం ప్రభావితం చేసే విధంగా మారటం వైసీపీకి శుభపరిణామమని పరిశీలకుల మాట.